Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 08:35 PM

చాట్రాయిలో విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

చాట్రాయిలో విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

చాట్రాయిలో విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
March 07, 2026 07:04 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల పూర్వ విద్యార్థి శీర్ణం సుమన్ రెడ్డి పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేశారు. శనివారం ప్రధానోపాధ్యాయులు డి. కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి చదువుతున్న 38 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, రెండు పెన్నులు, పెన్సిల్, స్కేల్, ఎరేసర్, షార్ప్నర్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సుమన్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు. పేద కుటుంబానికి చెందినప్పటికీ క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించి ముందుకు వచ్చానన్నారు. ప్రైవేట్ టీచర్‌గా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లోని టీసీఎల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. కష్టపడి చదివితే పేదరికం ఉన్నత స్థాయికి చేరడంలో అడ్డంకి కాదని, ప్రస్తుతం తాను సంవత్సరానికి కోటి రూపాయల వేతనం సంపాదిస్తున్నానని తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో, క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరి సౌకర్యవంతమైన జీవితం గడపవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోలి సత్యనారాయణ రెడ్డి, నీల ధనలక్ష్మి, రామారావు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News