Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 03:31 AM

చాట్రాయి మండలంలో ఊపందుకున్న మామిడికాయల ఎగుమతులు

చాట్రాయి మండలంలో ఊపందుకున్న మామిడికాయల ఎగుమతులు

చాట్రాయి మండలంలో ఊపందుకున్న మామిడికాయల ఎగుమతులు
March 07, 2026 07:38 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో మామిడికాయల ఎగుమతులు జోరుగా కొనసాగుతున్నాయి. మామిడి సీజన్ ప్రారంభమవడంతో రైతులు మంచి ధరలు లభిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్‌లో కలెక్టర్ రకం మామిడికాయ టన్నుకు సుమారు రూ.53,000 వరకు ధర లభిస్తుండగా, బంగినపల్లి రకం మామిడికాయ టన్నుకు రూ.80,000 నుండి రూ.1,50,000 వరకు ధర పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.

ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర మామిడి వ్యాపార సంస్థ అధినేత తల్లాడ శ్రీనివాసరావు, పవన్ కుమార్ వెల్లడించారు. చాట్రాయి మండలం నుండి మామిడికాయలను దేశంలోని ప్రధాన నగరాలకు పంపిస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం మామిడికాయలను బొంబాయి, జలగాం, సూరత్, అహ్మదాబాద్ తదితర నగరాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారు వివరించారు. మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు లాభాలు చేకూరుతున్నాయని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News