PRINT TIME: June 25, 2026 03:31 AM
చాట్రాయి మండలంలో ఊపందుకున్న మామిడికాయల ఎగుమతులు
చాట్రాయి మండలంలో ఊపందుకున్న మామిడికాయల ఎగుమతులు
March 07, 2026 07:38 PM
111 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో మామిడికాయల ఎగుమతులు జోరుగా కొనసాగుతున్నాయి. మామిడి సీజన్ ప్రారంభమవడంతో రైతులు మంచి ధరలు లభిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్లో కలెక్టర్ రకం మామిడికాయ టన్నుకు సుమారు రూ.53,000 వరకు ధర లభిస్తుండగా, బంగినపల్లి రకం మామిడికాయ టన్నుకు రూ.80,000 నుండి రూ.1,50,000 వరకు ధర పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.
ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర మామిడి వ్యాపార సంస్థ అధినేత తల్లాడ శ్రీనివాసరావు, పవన్ కుమార్ వెల్లడించారు. చాట్రాయి మండలం నుండి మామిడికాయలను దేశంలోని ప్రధాన నగరాలకు పంపిస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం మామిడికాయలను బొంబాయి, జలగాం, సూరత్, అహ్మదాబాద్ తదితర నగరాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారు వివరించారు. మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు లాభాలు చేకూరుతున్నాయని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి