Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'చలో హైదరాబాద్‌'ను విజయవంతం చేయండి: సుర్కంటి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 10:02 PM

చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వరి పంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్

చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వరి పంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్

చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వరి పంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్
March 05, 2026 05:27 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో రబీ కాలానికి వరి సాగు సుమారు 2,780 ఎకరాల్లో జరుగుతున్నదని మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ తెలిపారు. ప్రస్తుతం వరి పంట దుబ్బు చేసే దశలో ఉన్నందున రైతులు సమగ్ర పోషక మరియు యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు.

పంటలో నీటి ఎద్దడి లేకుండా సుమారు 5 సెంటీమీటర్ల నీటి మట్టాన్ని తప్పనిసరిగా నిల్వ ఉండేలా చూసుకోవాలని ఆయన చెప్పారు. వరి వేరు వ్యవస్థ పైభాగంలోనే ఉండటం వల్ల 5 సెంటీమీటర్ల నీటి మట్టం ఉండడం పంట ఎదుగుదలకు ఎంతో అవసరమని వివరించారు.

వరిలో కాండం తోలుచు పురుగు లక్షణాలను రైతులు గమనించాలని సూచించారు. పసుపు గోధుమ వర్ణంలో ఉండే రెక్కల పురుగులు ఉదయం సమయంలో ఆకుల కొనలపై కనిపిస్తాయని, గుడ్ల సముదాయం కూడా ఆకులపై కనిపిస్తుందని తెలిపారు. ఈ పురుగులు కాండంలోకి ప్రవేశించి లోపలి గుజ్జును తినడం వల్ల మొవ్వు ఎండిపోతుందని చెప్పారు. ఎండిన మొవ్వలను పీకినప్పుడు అవి సులభంగా ఊడి వస్తాయని, పూత దశలో ఈ పురుగు ప్రభావం ఉంటే కంకి తెల్లబడిపోతుందని వివరించారు.దీనిని నివారించడానికి పిలక దశలో కార్బో ఫ్యూరాన్ 3 జి 10 కిలోలు లేదా 4 జి గుళికలు 8 కిలోలు లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ చల్లాలని సూచించారు. అంకురం ఏర్పడే దశలో క్లోరోన్ ట్రిలిని ప్రోల్ 20 ఎస్ సి మందును ఒక ఎకరానికి 60 మిల్లీలీటర్లు లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ 50 డబ్ల్యూ పి మందును 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా పోలవరం గ్రామంలో వరి క్షేత్రాలను అధికారులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News