చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వరి పంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్
చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వరి పంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో రబీ కాలానికి వరి సాగు సుమారు 2,780 ఎకరాల్లో జరుగుతున్నదని మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ తెలిపారు. ప్రస్తుతం వరి పంట దుబ్బు చేసే దశలో ఉన్నందున రైతులు సమగ్ర పోషక మరియు యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు.
పంటలో నీటి ఎద్దడి లేకుండా సుమారు 5 సెంటీమీటర్ల నీటి మట్టాన్ని తప్పనిసరిగా నిల్వ ఉండేలా చూసుకోవాలని ఆయన చెప్పారు. వరి వేరు వ్యవస్థ పైభాగంలోనే ఉండటం వల్ల 5 సెంటీమీటర్ల నీటి మట్టం ఉండడం పంట ఎదుగుదలకు ఎంతో అవసరమని వివరించారు.
వరిలో కాండం తోలుచు పురుగు లక్షణాలను రైతులు గమనించాలని సూచించారు. పసుపు గోధుమ వర్ణంలో ఉండే రెక్కల పురుగులు ఉదయం సమయంలో ఆకుల కొనలపై కనిపిస్తాయని, గుడ్ల సముదాయం కూడా ఆకులపై కనిపిస్తుందని తెలిపారు. ఈ పురుగులు కాండంలోకి ప్రవేశించి లోపలి గుజ్జును తినడం వల్ల మొవ్వు ఎండిపోతుందని చెప్పారు. ఎండిన మొవ్వలను పీకినప్పుడు అవి సులభంగా ఊడి వస్తాయని, పూత దశలో ఈ పురుగు ప్రభావం ఉంటే కంకి తెల్లబడిపోతుందని వివరించారు.దీనిని నివారించడానికి పిలక దశలో కార్బో ఫ్యూరాన్ 3 జి 10 కిలోలు లేదా 4 జి గుళికలు 8 కిలోలు లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ చల్లాలని సూచించారు. అంకురం ఏర్పడే దశలో క్లోరోన్ ట్రిలిని ప్రోల్ 20 ఎస్ సి మందును ఒక ఎకరానికి 60 మిల్లీలీటర్లు లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ 50 డబ్ల్యూ పి మందును 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా పోలవరం గ్రామంలో వరి క్షేత్రాలను అధికారులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి