చాట్రాయి లో మృత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి: కొమ్ము ఆనందం
చాట్రాయి లో మృత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి: కొమ్ము ఆనందం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు బుర్రి జయరాజు (41) ఫిబ్రవరి 23న మృతి చెందిన విషయం తెలిసిందే. జయరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత 22 సంవత్సరాలుగా తాపీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించారు.
ఈ సందర్భంగా సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం జయరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జయరాజు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి లేకపోవడంతో వారు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందించాల్సిన పథకాలను సరిగా అమలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.
చనిపోయిన భవన నిర్మాణ కార్మికుడు బుర్రి జయరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని తగిన ఆర్థిక సహాయం అందించాలని కొమ్ము ఆనందం కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి