Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:38 AM

చాట్రాయి లో మృత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి: కొమ్ము ఆనందం

చాట్రాయి లో మృత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి: కొమ్ము ఆనందం

చాట్రాయి లో మృత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి: కొమ్ము ఆనందం
06-03-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు బుర్రి జయరాజు (41) ఫిబ్రవరి 23న మృతి చెందిన విషయం తెలిసిందే. జయరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత 22 సంవత్సరాలుగా తాపీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించారు.

ఈ సందర్భంగా సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం జయరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జయరాజు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి లేకపోవడంతో వారు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందించాల్సిన పథకాలను సరిగా అమలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.

చనిపోయిన భవన నిర్మాణ కార్మికుడు బుర్రి జయరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని తగిన ఆర్థిక సహాయం అందించాలని కొమ్ము ఆనందం కోరారు.

Sthanikam

చాట్రాయి లో మృత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి: కొమ్ము ఆనందం

Article Image

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు బుర్రి జయరాజు (41) ఫిబ్రవరి 23న మృతి చెందిన విషయం తెలిసిందే. జయరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత 22 సంవత్సరాలుగా తాపీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించారు.

ఈ సందర్భంగా సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం జయరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జయరాజు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి లేకపోవడంతో వారు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందించాల్సిన పథకాలను సరిగా అమలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.

చనిపోయిన భవన నిర్మాణ కార్మికుడు బుర్రి జయరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని తగిన ఆర్థిక సహాయం అందించాలని కొమ్ము ఆనందం కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News