Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరెగూడెంలో ఉపాధి హామీ పనులకు శ్రీకారం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 11:07 AM

బూరుగుగూడెం గ్రామంలో కోతుల బెడదతో మొక్కజొన్న పంట దున్నించిన రైతు

బూరుగుగూడెం గ్రామంలో కోతుల బెడదతో మొక్కజొన్న పంట దున్నించిన రైతు

బూరుగుగూడెం గ్రామంలో కోతుల బెడదతో మొక్కజొన్న పంట దున్నించిన రైతు
March 06, 2026 10:09 AM 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలంలో కోతుల గురించి పట్టించుకోని అధికారులు

ఎకరానికి రూ.40 వేల నష్టం – రైతును కరిచిన కోతి

చాట్రాయి మండలంలో కోతుల బెడద తట్టుకోలేక ఓ రైతు చేతికి అంది వచ్చిన మొక్కజొన్న పంటను దున్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట నేలపాలైంది.

మండలంలోని బూరుగుగూడెం గ్రామానికి చెందిన రైతు అనిపెద్ది సత్యనారాయణ మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే గత రెండు నెలలుగా సుమారు 200 కోతుల గుంపు తరచూ పంటపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించిందని ఆయన తెలిపారు. ఎకరానికి సుమారు రూ.40 వేల పెట్టుబడి పెట్టినా పంటను కాపాడుకోలేక చివరకు దున్నించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కోతులను తరిమివేయడానికి ఆరుగురు కూలీలతో ప్రయత్నించగా ఒక కోతి తనను కరిచి గాయపరిచిందని సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటన తర్వాత కూలీలు కూడా కోతులను తరిమేందుకు రావడం మానేశారని చెప్పారు. గత్యంతరం లేక చివరకు పంటను దున్నించుకున్నట్లు తెలిపారు.

గ్రామస్తులు మాట్లాడుతూ బూరుగుగూడెం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా పెరిగిందన్నారు. కోతులు ఇళ్లల్లోకి కూడా చొరబడి వస్తువులు, కూరగాయమొక్కలు నాశనం చేస్తున్నాయని మహిళలు వాపోయారు. గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాలుగా కోతుల బెడద తీవ్రతరం అయిందన్నారు.

పంటలను కాపాడుకునేందుకు టపాసులు పేల్చడం, మైక్ శబ్దాలు చేయడం, కొండముచ్చులు వదలడం, కర్రలతో తరమడం వంటి పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని రైతులు తెలిపారు.

పంట నష్టపోయిన రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలని, కోతులను అటవీ ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News