బోగారంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరం. వ్యాధి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం : సర్పంచ్ సాయికుమార్ గౌడ్
బోగారంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరం. వ్యాధి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం : సర్పంచ్ సాయికుమార్ గౌడ్
Editor Desk
రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ (TBMBA) 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏఏఎం నీర్నెముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రజలు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, మేడి కృష్ణ, గోగు మహేష్ యాదవ్ వైద్యాధికారి గోపాల్ (ఎంపీహెచ్ఈఓ), జానకి (ఎస్టీఎస్), అశ్విని (ఎస్టీఎల్ఎస్), కవిత (ఎంపీహెచ్ఏ), రత్న (ఎంపీహెచ్ఏ), ఎక్స్రే టెక్నీషియన్ ఉమేష్, ఆశా కార్యకర్తలు జెల్ల సంధ్య, జెల్ల పారిజాత తదితరులు పాల్గొని టీబీ నివారణ, చికిత్సపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి