Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:56 AM

బోగారంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరం. వ్యాధి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం : సర్పంచ్ సాయికుమార్ గౌడ్

బోగారంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరం. వ్యాధి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం : సర్పంచ్ సాయికుమార్ గౌడ్

బోగారంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరం.  వ్యాధి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం : సర్పంచ్ సాయికుమార్ గౌడ్
30-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ (TBMBA) 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏఏఎం నీర్నెముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రజలు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, మేడి కృష్ణ, గోగు మహేష్ యాదవ్ వైద్యాధికారి గోపాల్ (ఎంపీహెచ్‌ఈఓ), జానకి (ఎస్‌టీఎస్), అశ్విని (ఎస్‌టీఎల్‌ఎస్), కవిత (ఎంపీహెచ్‌ఏ), రత్న (ఎంపీహెచ్‌ఏ), ఎక్స్‌రే టెక్నీషియన్ ఉమేష్, ఆశా కార్యకర్తలు జెల్ల సంధ్య, జెల్ల పారిజాత తదితరులు పాల్గొని టీబీ నివారణ, చికిత్సపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

Sthanikam

బోగారంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరం. వ్యాధి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం : సర్పంచ్ సాయికుమార్ గౌడ్

Article Image

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ (TBMBA) 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏఏఎం నీర్నెముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రజలు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, మేడి కృష్ణ, గోగు మహేష్ యాదవ్ వైద్యాధికారి గోపాల్ (ఎంపీహెచ్‌ఈఓ), జానకి (ఎస్‌టీఎస్), అశ్విని (ఎస్‌టీఎల్‌ఎస్), కవిత (ఎంపీహెచ్‌ఏ), రత్న (ఎంపీహెచ్‌ఏ), ఎక్స్‌రే టెక్నీషియన్ ఉమేష్, ఆశా కార్యకర్తలు జెల్ల సంధ్య, జెల్ల పారిజాత తదితరులు పాల్గొని టీబీ నివారణ, చికిత్సపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News