బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై పోలీసులకు యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు
బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై పోలీసులకు యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు
Bandi Kiran Kumar
తుంగతుర్తి;సరూర్నగర్లో జూలై 18న నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) సమక్షంలో, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను యూత్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా సంబంధిత నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జోహార్, యువజన కాంగ్రెస్ నాయకులు రాంబాబు, శ్రీకాంత్ నాయుడు, భుజంగరావు, కొండగడుపుల నవీన్, అక్కెనేపల్లి రాములు, కరీం, బాబా, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి