భువనగిరి–రామన్నపేటలో పౌరసరఫరాల శాఖ దాడులు… 49 సిలిండర్లు సీజ్
భువనగిరి–రామన్నపేటలో పౌరసరఫరాల శాఖ దాడులు… 49 సిలిండర్లు సీజ్
స్థానికం బృందం
హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్ల దుర్వినియోగం బట్టబయలు
యాదాద్రి భువనగిరి,: హోటళ్లు, వ్యాపార కేంద్రాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్న ఘటనలు బయటపడ్డాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం భువనగిరి, రామన్నపేట ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం 49 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనపర్చుకున్నారు.
భువనగిరి పట్టణంలో పౌరసరఫరాల ఉప తహశీల్దార్ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది పలు హోటళ్లు, వ్యాపార కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమర్షియల్ సిలిండర్లకు బదులుగా వినియోగిస్తున్న 25 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.
ఇక రామన్నపేటలో పౌరసరఫరాల ఉప తహశీల్దార్ బాలామణితో పాటు హైదరాబాద్ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పలు వ్యాపార కేంద్రాల్లో 24 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనపర్చుకున్నారు.
ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 49 సిలిండర్లను అధికారులు స్వాధీనపర్చుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యాపార కేంద్రాల్లో కేవలం కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వినియోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తనిఖీలలో పౌరసరఫరాల శాఖ సిబ్బంది మరియు విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి