Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:12 AM

భువనగిరి–రామన్నపేటలో పౌరసరఫరాల శాఖ దాడులు… 49 సిలిండర్లు సీజ్

భువనగిరి–రామన్నపేటలో పౌరసరఫరాల శాఖ దాడులు… 49 సిలిండర్లు సీజ్

భువనగిరి–రామన్నపేటలో పౌరసరఫరాల శాఖ దాడులు… 49 సిలిండర్లు సీజ్
March 12, 2026 06:56 PM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్ల దుర్వినియోగం బట్టబయలు

యాదాద్రి భువనగిరి,: హోటళ్లు, వ్యాపార కేంద్రాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్న ఘటనలు బయటపడ్డాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం భువనగిరి, రామన్నపేట ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం 49 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనపర్చుకున్నారు.

భువనగిరి పట్టణంలో పౌరసరఫరాల ఉప తహశీల్దార్ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది పలు హోటళ్లు, వ్యాపార కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమర్షియల్ సిలిండర్లకు బదులుగా వినియోగిస్తున్న 25 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.

ఇక రామన్నపేటలో పౌరసరఫరాల ఉప తహశీల్దార్ బాలామణితో పాటు హైదరాబాద్ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పలు వ్యాపార కేంద్రాల్లో 24 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనపర్చుకున్నారు.

ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 49 సిలిండర్లను అధికారులు స్వాధీనపర్చుకున్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యాపార కేంద్రాల్లో కేవలం కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వినియోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తనిఖీలలో పౌరసరఫరాల శాఖ సిబ్బంది మరియు విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News