భువనగిరి మున్సిపాలిటీలో "ప్రజా పాలన" ప్రగతి ప్రణాళికలో చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి,రవి కుమార్
భువనగిరి మున్సిపాలిటీలో "ప్రజా పాలన" ప్రగతి ప్రణాళికలో చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి,రవి కుమార్
Sthanikam District Staff Reporter
భువనగిరి టౌన్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన" - ప్రగతి ప్రణాళిక
99 రోజుల కార్యాచరణ ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా భువనగిరి మున్సిపాలిటీలో వివిధ వార్డులలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 6వ తేదీ నుండి మార్చి15వ తేదీ వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి పురపాలక సంఘం పరిధిలోని వార్డు నెం.2,7,19,14,26లలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ, భువనగిరి పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 35 వార్డులలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం,అభివృద్ధి కార్యక్రమాల అమలు మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం భువనగిరి పురపాలక సంఘం కార్యాలయంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి చెత్త చెదారం తొలగించి విరిగిపోయిన ఫర్నిచర్,కుర్చీలను ఇతర సామాగ్రిని,మరియు రికార్డు రూం నిర్వహణ ఏర్పాట్లూ,వివిధ వార్డులలో ఫాగింగ్,చెరువు కట్టల వద్ద క్లీనింగ్ వంటి పనులను చేపట్టి 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి