Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:15 PM

భూగర్భ జలాల సంరక్షణపై అవగాహన పెంచాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

భూగర్భ జలాల సంరక్షణపై అవగాహన పెంచాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

భూగర్భ జలాల సంరక్షణపై అవగాహన పెంచాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
March 13, 2026 03:55 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: భూగర్భ జలాలను పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు తగినంత నీటి వనరులు అందుబాటులో ఉంటాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.

శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో Central Ground Water Board ఆధ్వర్యంలో భూగర్భ జలాల సంరక్షణపై ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం నీటి ఎద్దడిని నివారించాలంటే భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ఇంకుడు గుంతలు, నీటి కుంటల ద్వారా భూగర్భ జలాలను పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది కేంద్రీయ భూగర్భ జల శాఖ అధ్యయనాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని అన్నారు.

సీజీడబ్ల్యుబీ రీజినల్ డైరెక్టర్ జ్యోతి కుమార్ మాట్లాడుతూ సాంకేతిక పద్ధతుల ద్వారా భూగర్భ జల సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో వివరించారు. అనంతరం భూగర్భ జల మండలి ముద్రించిన NAQUIM రిపోర్ట్ మరియు జిల్లా రీఛార్జ్ మ్యాప్‌ను విడుదల చేశారు.

జిల్లా భూగర్భ జల అధికారి జ్యోతి కుమార్ మాట్లాడుతూ భువనగిరి జిల్లాలో నీటి ఎద్దడిని నివారించాలంటే భూగర్భ జల వనరులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీజీడబ్ల్యుబీ శాస్త్రవేత్త యాదయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, సుధీర్ కుమార్, మాధవి, సరిత, రేష్మ పిల్లాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News