భువనగిరిలో సత్య సాయి బాబా దివ్య రథోత్సవం
భువనగిరిలో సత్య సాయి బాబా దివ్య రథోత్సవం
Editor Desk
భువనగిరిలో సత్య సాయి దివ్య రథోత్సవం
ప్రేమ–సేవ సందేశంతో కన్నుల పండుగ
భువనగిరి: స్థానికం ప్రతినిధి
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టపర్తి నుంచి బయలుదేరిన శ్రీ సత్య సాయి బాబా ప్రేమ వాహిని దివ్య రథోత్సవ యాత్ర సోమవారం భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుకుంది. సత్యసాయి జిల్లా సేవా సభ్యులు రథానికి ఘన స్వాగతం పలికారు.
భువనగిరి పట్టణంలోని సాయిబాబా మందిరం నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు ప్రధాన రహదారిపై విద్యుత్ కాంతులతో అలంకరించిన రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. పట్టణ ప్రజలు, సత్యసాయి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రథయాత్రను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, ఐక్యత, సోదర భావం సందేశాలు మరోసారి ప్రతిధ్వనించాయి. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సాయి సేవా సభ్యులు ఉత్సాహంగా పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో సోమ రాధాకృష్ణమూర్తి, సోమ సీతారాములు, బాలరాజు, సత్య సాయి సేవా సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి