PRINT TIME: July 11, 2026 06:10 PM
భార్య వెంటనే భర్త… గంటల్లోనే ముగిసిన జీవన ప్రయాణం
భార్య వెంటనే భర్త… గంటల్లోనే ముగిసిన జీవన ప్రయాణం
March 29, 2026 02:53 PM
123 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కలిసే జీవితం… కలిసే మరణం
శాలిగౌరారం మండలం మాదారం కలాన్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వృద్ధాప్యంతో మామిడి ముత్తమ్మ(70) శనివారం కన్నుమూశారు. దశాబ్దాల పాటు ఆమెతో జీవితం పంచుకున్న భర్త సైదులు(80) భార్య మృతి వార్తను తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.
జీవితాంతం కలిసి నడిచిన ఈ దంపతులు, మరణంలోనూ విడిపోకపోవడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. “ఏడడుగుల బంధం చివరి వరకు నిలిచింది… ఒకరి వెంట ఒకరు వెళ్లిపోయారు” అంటూ గ్రామస్తులు విషాదంతో గుర్తుచేసుకున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి