Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు: అమ్మకు అక్షరమాల ఉల్లాస్… గ్రామ సర్పంచ్ బోయిన వేణు డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 04:49 PM

భార్య వెంటనే భర్త… గంటల్లోనే ముగిసిన జీవన ప్రయాణం

భార్య వెంటనే భర్త… గంటల్లోనే ముగిసిన జీవన ప్రయాణం

భార్య వెంటనే భర్త… గంటల్లోనే ముగిసిన జీవన ప్రయాణం
March 29, 2026 02:53 PM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలిసే జీవితం… కలిసే మరణం

శాలిగౌరారం మండలం మాదారం కలాన్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వృద్ధాప్యంతో మామిడి ముత్తమ్మ(70) శనివారం కన్నుమూశారు. దశాబ్దాల పాటు ఆమెతో జీవితం పంచుకున్న భర్త సైదులు(80) భార్య మృతి వార్తను తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.

జీవితాంతం కలిసి నడిచిన ఈ దంపతులు, మరణంలోనూ విడిపోకపోవడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. “ఏడడుగుల బంధం చివరి వరకు నిలిచింది… ఒకరి వెంట ఒకరు వెళ్లిపోయారు” అంటూ గ్రామస్తులు విషాదంతో గుర్తుచేసుకున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News