Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:33 AM

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి: రైతు సంఘాల డిమాండ్

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి: రైతు సంఘాల డిమాండ్

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి: రైతు సంఘాల డిమాండ్
04-03-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విజయవాడ భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపిస్తూ దాన్ని తక్షణమే రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్డీఏ భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ను విజయవాడలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర సమన్వయ బాధ్యుడు వడ్డే శోభనాద్రీశ్వరరావుతో పాటు వై. కేశవరావు, కే.వి.వి. ప్రసాద్, డి. హరినాథ్, కొల్లా రాజమోహన్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, చుండూరు రంగారావు, పటాపంచుల జమలయ్య తదితర రైతు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ మాట్లాడుతూ, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ వ్యవసాయ రంగం దెబ్బతింటుందని, రైతుల ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రైతుల హక్కులను కాపాడే దిశగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

మార్చి 9వ తేదీ వరకు గ్రామ గ్రామాన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి, అదే రోజు రాష్ట్రపతికి దేశవ్యాప్తంగా వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. అలాగే, భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మార్చి 23న నిరసన సభలు నిర్వహించి, ఏప్రిల్ 5న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Sthanikam

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి: రైతు సంఘాల డిమాండ్

Article Image

విజయవాడ భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపిస్తూ దాన్ని తక్షణమే రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్డీఏ భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ను విజయవాడలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర సమన్వయ బాధ్యుడు వడ్డే శోభనాద్రీశ్వరరావుతో పాటు వై. కేశవరావు, కే.వి.వి. ప్రసాద్, డి. హరినాథ్, కొల్లా రాజమోహన్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, చుండూరు రంగారావు, పటాపంచుల జమలయ్య తదితర రైతు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ మాట్లాడుతూ, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ వ్యవసాయ రంగం దెబ్బతింటుందని, రైతుల ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రైతుల హక్కులను కాపాడే దిశగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

మార్చి 9వ తేదీ వరకు గ్రామ గ్రామాన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి, అదే రోజు రాష్ట్రపతికి దేశవ్యాప్తంగా వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. అలాగే, భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మార్చి 23న నిరసన సభలు నిర్వహించి, ఏప్రిల్ 5న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News