భక్తుల సౌకర్యాలే ధ్యేయం..! ముత్యాలమ్మ ఆలయం అభివృద్ధికి సర్పంచ్ విక్రమ్ ప్రత్యేక చొరవ దాతల సహకారంతో స్నానపు గదుల నిర్మాణానికి శ్రీకారం.
భక్తుల సౌకర్యాలే ధ్యేయం..! ముత్యాలమ్మ ఆలయం అభివృద్ధికి సర్పంచ్ విక్రమ్ ప్రత్యేక చొరవ దాతల సహకారంతో స్నానపు గదుల నిర్మాణానికి శ్రీకారం.
Editor Desk
ఇంద్రపాలనగరం, :
గ్రామాభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చొరవతో శ్రీ శ్రీ శ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో భక్తుల కోసం మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు ప్రారంభమయ్యాయి.
దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన వసతి కల్పించాలన్న సర్పంచ్ విజ్ఞప్తికి స్పందించిన భువనగిరికి చెందిన దాతలు కవిత–శ్రీనివాస్ తమ తండ్రి బుగ్గయ్య జ్ఞాపకార్థం స్నానపు గదుల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించారు. సోమవారం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు గ్రామపంచాయతీ కట్టుబడి ఉందని, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచ్ తెలిపారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి నరేందర్, పాలసంఘం చైర్మన్ కంబాలపల్లి శ్రీశైలం, చేనేత సహకార సంఘం చైర్మన్ రవ్వ నర్సింహాతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి