బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం
బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం
Editor Desk
రామన్నపేట మండలం లోని సిరిపురం గ్రామం నుంచి పరిసర గ్రామాలకు వెళ్లే అంతర్గత పంచాయతీరాజ్ రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బల్గురి అంజయ్య ప్రభుత్వాన్ని కోరారు.
సిపిఎం పోరు యాత్రలో భాగంగా గ్రామ నాయకులతో కలిసి వెలిమినేడు, పెద్దకాపర్తి, తుమ్మలగూడెం మార్గాలను పరిశీలించిన ఆయన అనంతరం మాట్లాడుతూ, ప్రధాన రహదారులు గుంతలతో నిండిపోయి ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని అన్నారు. దశాబ్దాలుగా ప్రజలు సమస్యను తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు.
వెంటనే ఈ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీలు బడుగు రమేష్, రాపోలు ప్రభాకర్, కూనూరు వెంకటేశం, వార్డు సభ్యులు మొటే స్వామి, జెల్ల శ్రీనాధం, సంగిశెట్టి మహేష్, గ్రామ నాయకులు కూనూరు గణేష్, కంకల నరసింహ, బల్గురి నరసింహ, కందుల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి