Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతపై గ్రామస్తుల జాగ్రత్తలు.. సీసీ కెమెరాల ఏర్పాటు సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 02:19 PM

బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
January 20, 2026 05:10 PM 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

మునగాల స్థానిక ప్రతినిధి రాఘవేందర్

మునగాల మండలం సీతానగరం గ్రామపంచాయతీ పరిధిలోనీ సీతానగరం తండా నుండి సుమారు 50 మంది వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కోదాడ మాజీ ఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్ గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు.ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను కొనసాగిస్తలేదని, కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యల పరిష్కారం కంటే వారికొచ్చే కమీషన్ల మీదనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారని పేర్కొన్నారు.


గతంలో ఈ ప్రాంతంలో బీడు భూములు ఎక్కువగా కనిపించేవని కానీ తెలంగాణ రాష్టం ఆవిర్భవించి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేశారని, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన రాగానే మళ్లీ పాత రోజులే కనిపిస్తున్నాయని తెలిపారు.


అందుకే పాలన చేసే వారికి ప్రజల పట్ల ప్రేమ ఉండాలని కేసీఆర్ కి అలాంటి ప్రేమ ఉందీ కాబట్టే ఎవరు అడగకున్నా ప్రజలకు అవసరమయ్యో ప్రతిపని చేశారని కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కి అలాంటిదేది పట్టింపులు లేవని అందుకే రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో ఇలా తయారయ్యిందని అన్నారు.


రాష్టానికి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీర్ఎస్ పార్టీనీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News