Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:57 PM

బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం తాటికొండ సీతయ్య, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు

బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం తాటికొండ సీతయ్య, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు

బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం తాటికొండ సీతయ్య, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు
January 20, 2026 02:06 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి : రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి పార్టీ దిమ్మెలను కూల్చాలని వ్యాఖ్యానించడం తీవ్రంగా ఖండనీయమని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సమాన హక్కులు ఉంటాయని, అలాంటి పరిస్థితుల్లో శాంతిభద్రతలకు భంగం కలిగేలా పార్టీ కార్యాలయాలను కూల్చాలని చెప్పడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ల పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎప్పుడైనా ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే నేటి ప్రభుత్వం ఉండేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఏ గ్రామంలో అయినా పార్టీ దిమ్మెను ముట్టుకుంటే ప్రజల తిరుగుబాటుకు గురికాక తప్పదని హెచ్చరించారు. ఇకనైనా ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, మండల నాయకులు గుండగాని దుర్గయ్య, గోపగాని రమేష్, పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న, నల్లబెల్లి వెంకన్న, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News