బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు
బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్: మండలంలోని మిర్జాపూర్ (బి) గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని గ్రామస్థులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. జహీరాబాద్ డిపోకు చెందిన బస్సులు రాయికోడ్, వట్పల్లి వైపు వెళ్తున్నప్పటికీ తమ గ్రామంలో నిలపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్థులు, విద్యార్థులు కలిసి కొంతసేపు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే బస్సులను గ్రామంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న జహీరాబాద్ డిపో అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన హామీతో గ్రామస్థులు తమ ఆందోళనను విరమించడంతో బస్సుల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి