Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'చలో హైదరాబాద్‌'ను విజయవంతం చేయండి: సుర్కంటి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 09:51 PM

బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు

బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు

బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు
March 05, 2026 06:46 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: మండలంలోని మిర్జాపూర్ (బి) గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని గ్రామస్థులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. జహీరాబాద్ డిపోకు చెందిన బస్సులు రాయికోడ్, వట్పల్లి వైపు వెళ్తున్నప్పటికీ తమ గ్రామంలో నిలపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్థులు, విద్యార్థులు కలిసి కొంతసేపు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే బస్సులను గ్రామంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న జహీరాబాద్ డిపో అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన హామీతో గ్రామస్థులు తమ ఆందోళనను విరమించడంతో బస్సుల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News