Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:04 AM

బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు

బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు

బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు
05-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: మండలంలోని మిర్జాపూర్ (బి) గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని గ్రామస్థులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. జహీరాబాద్ డిపోకు చెందిన బస్సులు రాయికోడ్, వట్పల్లి వైపు వెళ్తున్నప్పటికీ తమ గ్రామంలో నిలపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్థులు, విద్యార్థులు కలిసి కొంతసేపు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే బస్సులను గ్రామంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న జహీరాబాద్ డిపో అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన హామీతో గ్రామస్థులు తమ ఆందోళనను విరమించడంతో బస్సుల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరాయి.

Sthanikam

బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు

Article Image

న్యాల్కల్: మండలంలోని మిర్జాపూర్ (బి) గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని గ్రామస్థులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. జహీరాబాద్ డిపోకు చెందిన బస్సులు రాయికోడ్, వట్పల్లి వైపు వెళ్తున్నప్పటికీ తమ గ్రామంలో నిలపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్థులు, విద్యార్థులు కలిసి కొంతసేపు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే బస్సులను గ్రామంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న జహీరాబాద్ డిపో అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన హామీతో గ్రామస్థులు తమ ఆందోళనను విరమించడంతో బస్సుల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News