Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్ల బ్యాడ్జిలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన, శంకర్ గౌడ్‌కు ఘన నివాళి కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 12:09 PM

బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు

బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు

బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు
March 05, 2026 06:46 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: మండలంలోని మిర్జాపూర్ (బి) గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని గ్రామస్థులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. జహీరాబాద్ డిపోకు చెందిన బస్సులు రాయికోడ్, వట్పల్లి వైపు వెళ్తున్నప్పటికీ తమ గ్రామంలో నిలపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్థులు, విద్యార్థులు కలిసి కొంతసేపు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే బస్సులను గ్రామంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న జహీరాబాద్ డిపో అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన హామీతో గ్రామస్థులు తమ ఆందోళనను విరమించడంతో బస్సుల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News