బస్స్టాండ్లో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు విద్యార్థులు.. ఆర్టీసీ కార్గో నిర్వాహకుడి చాకచక్యంతో హాస్టల్కు చేరిక
బస్స్టాండ్లో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు విద్యార్థులు.. ఆర్టీసీ కార్గో నిర్వాహకుడి చాకచక్యంతో హాస్టల్కు చేరిక
Komidala Mahender reddy
సమయస్ఫూర్తితో స్పందించిన దశరథ.. తప్పించుకువచ్చిన గురుకుల విద్యార్థులు సురక్షితం.
చిట్యాల బస్స్టాండ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు గురుకుల విద్యార్థులను గుర్తించి, వారిని సురక్షితంగా హాస్టల్ సిబ్బందికి అప్పగించిన ఆర్టీసీ కార్గో నిర్వాహకుడు తన బాధ్యతాయుత వైఖరితో ప్రశంసలు అందుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఇద్దరు విద్యార్థులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తిరిగి తమ హాస్టల్కు చేరుకున్నారు.
వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చిట్యాల బస్స్టాండ్లో ఇద్దరు బాలురు బ్యాగులు వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. చాలా సేపటి నుంచి వారు అక్కడే ఉండటాన్ని గమనించిన టీజీఎస్ ఆర్టీసీ కార్గో నిర్వాహకుడు పొలిమేర దశరథ వారిని పలకరించి వివరాలు అడిగారు.
మొదట కొంత సంకోచించిన బాలురు, అనంతరం దశరథ ప్రేమగా మాట్లాడటంతో అసలు విషయం వెల్లడించారు. తాము రామన్నపేట ఎస్సీ గురుకుల హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చామని తెలిపారు.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన దశరథ వెంటనే గురుకుల హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం బాలురను తన పర్యవేక్షణలో ఉంచి, హాస్టల్ సిబ్బంది వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకున్నారు. సిబ్బంది చిట్యాలకు చేరుకున్న తర్వాత విద్యార్థులను వారికి అప్పగించారు.సమయానికి స్పందించి ఇద్దరు విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన పొలిమేర దశరథను స్థానికులు, ప్రయాణికులు, గురుకుల సిబ్బంది అభినందించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీసే పరిస్థితుల్లో ఆయన చూపిన చొరవ ఆదర్శప్రాయమని పలువురు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి