బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశాలు ఇవ్వాలి. సిపిఐ – ఈవోకు వినతి పత్రం
బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశాలు ఇవ్వాలి. సిపిఐ – ఈవోకు వినతి పత్రం
Editor Desk
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ ప్రజా నాట్యమండలి కళాకారులకు ప్రదర్శనలలో అవకాశం కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి కోరారు. ఆదివారం సిపిఐ ప్రతినిధి బృందం దేవస్థానం ఈవో భవాని శంకర్కు వినతి పత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా నాట్యమండలి కళాకారులు సమాజ సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారని తెలిపారు. అలాంటి కళాకారులకు బ్రహ్మోత్సవాల వంటి వేదికల్లో అవకాశాలు కల్పిస్తే సంప్రదాయ కళలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.
యాదగిరిగుట్ట కొండపై ఉన్న పలు స్థానిక సమస్యలను కూడా ఈవో దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈవో హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, చెక్క వెంకటేష్, ఎండీ ఇమ్రాన్, పేరబోయిన మహేందర్, మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి