మిత్రుడికి అండగా నిలిచిన బాల్య స్నేహితులు
మునగాల మండల పరిధిలోని నర్సింహులగూడెం జడ్పీహెచ్ఎస్ పాఠశాల 1999-2003 బ్యాచ్ విద్యార్థులు తమ స్నేహాన్ని చాటుకున్నారు. తమ బాల్య మిత్రుడు ఎస్కే రఫీ భార్య సైదాబీ మరణించిన విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు, ఆదివారం నర్సింహులగూడెం గ్రామంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. స్నేహం కన్నా గొప్ప బంధం లేదని, ఆపదలో ఉన్న మిత్రుడికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. వీరి దాతృత్వాన్ని గ్రామస్థులు ఎంతగానో అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి