Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆర్టీసీ సమ్మెకు సర్పంచ్ విక్రమ్ సంఘీభావం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 03:02 PM

బలసదన్ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలలి

బలసదన్ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలలి

బలసదన్ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలలి
March 04, 2026 03:09 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

భువనగిరి పట్టణ కేంద్రంలో స్థానిక మీనానగర్ లో బాలసదనంను బుధవారం రోజు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మిక తనిఖీ చేశారు. బాలసదనంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారని,అటెండన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, విద్యార్థులు ఏ.ఏ తరగతులు చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు.బాలసదనంలో ఉన్న పిల్లలతో కలెక్టర్ ముచ్చటించారు. రుచి కరమైన భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను మీకు ఏమి అయినా కావాలా అని అడగగా పిల్లలు మ్యూజిక్ టీచర్ కావాలని తెలుపగా పిల్లల కోరిక మేరకు మ్యూజిక్ టీచర్ ను తాత్కాలికంగా నియమించాలని సంబంధిత అధికారులను అదేశించారు. విద్యార్థులందరికీ హెల్త్ ప్రొఫైల్ ఉందా అని అడిగి తెలుసుకున్నారు. బాలసదనంలో వాటర్ ఫిల్టర్ పనిచేయడం లేదని తెలపడంతో వెంటనే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బెడ్ షీట్ లు సరిగా లేకపోవడంతో కొత్త బెడ్ షీట్లు ఇవ్వాలని సూచించారు.అనంతరంనిర్మాణంలో ఉన్న బాలసదనం భవనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు. మున్సిపల్ కమిషనర్ రామలింగం భువనగిరి తహసీల్దార్ జగన్ మోహన్ ప్రసాద్.బీ ఆర్ బీ కో-ఆర్డినేటర్ అనంత లక్ష్మీ,యశోద,బాలసదన్ సిబ్బంది.పిల్లలు.తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News