Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాయం చేయండి – కలెక్టర్‌ను ఆశ్రయించిన ఐకేపీ వివో జూలైలోనే పీఎం కిసాన్ 23వ విడత?.. రైతులకు ఎదురుచూపులు! 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 06:43 PM

బైక్‌ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి

బైక్‌ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి

బైక్‌ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి
April 21, 2026 05:05 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిత్తూరు జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో విషాదాన్ని నింపింది. బైక్‌పై వెళ్తున్న కుటుంబాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో దంపతులు, వారి చిన్నారి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు.

చింతలగుంట గ్రామానికి చెందిన హేమచంద్ర (40), సరస్వతి (36) దంపతులు తమ కుమార్తె లలిత (10)తో కలిసి యడగుర్కి గ్రామానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలో కొమ్మరమడుగు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి వారి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా కుటుంబం అంతరించిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News