Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 06:55 AM

బైక్‌ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి

బైక్‌ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి

బైక్‌ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి
April 21, 2026 05:05 PM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిత్తూరు జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో విషాదాన్ని నింపింది. బైక్‌పై వెళ్తున్న కుటుంబాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో దంపతులు, వారి చిన్నారి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు.

చింతలగుంట గ్రామానికి చెందిన హేమచంద్ర (40), సరస్వతి (36) దంపతులు తమ కుమార్తె లలిత (10)తో కలిసి యడగుర్కి గ్రామానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలో కొమ్మరమడుగు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి వారి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా కుటుంబం అంతరించిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News