బైక్ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి
బైక్ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి
Editor Desk
చిత్తూరు జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో విషాదాన్ని నింపింది. బైక్పై వెళ్తున్న కుటుంబాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో దంపతులు, వారి చిన్నారి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు.
చింతలగుంట గ్రామానికి చెందిన హేమచంద్ర (40), సరస్వతి (36) దంపతులు తమ కుమార్తె లలిత (10)తో కలిసి యడగుర్కి గ్రామానికి బైక్పై బయలుదేరారు. మార్గమధ్యంలో కొమ్మరమడుగు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి వారి బైక్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా కుటుంబం అంతరించిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి