Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:12 PM

బడుగు బలహీనుల కోసం పోరాడిన పాపన్నకు నివాళి

బడుగు బలహీనుల కోసం పోరాడిన పాపన్నకు నివాళి

బడుగు బలహీనుల కోసం పోరాడిన పాపన్నకు నివాళి
April 02, 2026 06:44 PM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: సర్దార్ సర్వాయి పాపన్న 316వ వర్ధంతి సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బావాండ్లపల్లి బాలరాజు, మండల అధ్యక్షులు కూమారు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు మునికుంట్ల లెనిన్ పాల్గొని పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపన్న వరంగల్ జిల్లా (ప్రస్తుతం జనగాం జిల్లా) రఘునాథపల్లి మండలం ఖిలసాపురం గ్రామంలో జన్మించారని తెలిపారు. బాల్యంలోనే పశువులు కాస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను గమనించిన పాపన్న, యుక్త వయసులోనే అభ్యుదయ భావజాలాన్ని అలవర్చుకున్నారని పేర్కొన్నారు.

అన్ని కులాలు, వర్గాల వారితో స్నేహపూర్వకంగా మెలిగిన పాపన్న, పెత్తందారి వర్గాలు, జమీందారులు, దొరలు, భూస్వాముల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. గోల్కొండ కోటపై బడుగు బలహీన వర్గాల జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఉద్యమం చేపట్టిన మహా వీరుడని కొనియాడారు.

1675లో సర్వాయిపేటలో స్వరాజ్యాన్ని స్థాపించి, పదివేల మందికి పైగా గరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప యోధుడిగా పాపన్న చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బైరు రమేష్, పబ్బు స్వామి, అడ్వకేట్ కూనూరు శ్రీనివాస్, బాలగోని మల్లయ్య, బైరు శంకరయ్య, గంగాపురం యాదయ్య, గుండు లింగయ్య, చెరుకు శివరాజ్, వీరమల్ల ముత్తయ్య, వీరమల్ల నరసింహ, కొండ రాములు, కూనూరు అంజన్ కుమార్, నకిరేకంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News