ఆయకట్టుకు శాశ్వత స్థిరీకరణ కావాలి మంత్రి ఉత్తమ్ను కలిసిన ఎంపీ చామల
ఆయకట్టుకు శాశ్వత స్థిరీకరణ కావాలి మంత్రి ఉత్తమ్ను కలిసిన ఎంపీ చామల
స్థానికం బృందం
సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ డి–10 కాలువ నుంచి జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం తపాస్పల్లి రిజర్వాయర్ డి–3 కాలువ కింద ఉన్న ఆయకట్టును శాశ్వతంగా స్థిరీకరించాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.
బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. దూల్మిట్ట, చేర్యాల మండలాల పరిధిలోని కమలాయపల్లి, అర్జున్పట్ల, ఆకునూరు, జాలపల్లి, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాలకు చెందిన సుమారు 7 వేల ఎకరాల సాగుభూమి రంగనాయక సాగర్ డి–10 కాలువ కింద శాశ్వతంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో ప్రజల అవసరాల మేరకు ఎంపీ వినతిపై మంత్రి తాత్కాలిక జీవో జారీ చేసి నీటి సరఫరాకు అనుమతి ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అయితే రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువులకు నిరంతర నీటి సరఫరా జరిగేలా తాత్కాలిక ఉత్తర్వుల స్థానంలో శాశ్వత జీవో జారీ చేయాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి