Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:08 AM

ఆటో డ్రైవర్ కన్నీరు… స్పందించిన ఎమ్మెల్యే ఇంటికే వెళ్లి పరామర్శించిన పార్థసారథి

ఆటో డ్రైవర్ కన్నీరు… స్పందించిన ఎమ్మెల్యే ఇంటికే వెళ్లి పరామర్శించిన పార్థసారథి

ఆటో డ్రైవర్ కన్నీరు… స్పందించిన ఎమ్మెల్యే ఇంటికే వెళ్లి పరామర్శించిన పార్థసారథి
March 12, 2026 09:59 PM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: పోలీసుల జరిమానాల భారంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్‌కు ఎమ్మెల్యే పార్థసారథి అండగా నిలిచారు. ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తిమ్మప్ప సోషల్ మీడియాలో తన బాధను వెల్లడించిన వీడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించారు.

రోజంతా కష్టపడితే రూ.400 నుంచి రూ.500 మాత్రమే సంపాదన వస్తోందని, అందులో ఎక్కువ భాగం పోలీసుల జరిమానాలకే వెళ్లిపోతోందని తిమ్మప్ప వాపోయాడు. తల్లి కూలి పనికి వెళ్లి సంపాదించే రూ.200తో కలిసి కుటుంబం అతికష్టం మీద గడుస్తోందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ జరిమానాలు విధిస్తే పేదలు ఎలా బతకాలని అధికారులను ప్రశ్నించాడు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పార్థసారథి తిమ్మప్ప ఇంటికి వెళ్లి అతని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ పక్కనే కూర్చుని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిబంధనల పేరుతో పేదలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. తిమ్మప్ప లాంటి కష్టజీవులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని సీఎం, డీసీఎం మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News