Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 12:01 AM

ఆటో డ్రైవర్ కన్నీరు… స్పందించిన ఎమ్మెల్యే ఇంటికే వెళ్లి పరామర్శించిన పార్థసారథి

ఆటో డ్రైవర్ కన్నీరు… స్పందించిన ఎమ్మెల్యే ఇంటికే వెళ్లి పరామర్శించిన పార్థసారథి

ఆటో డ్రైవర్ కన్నీరు… స్పందించిన ఎమ్మెల్యే ఇంటికే వెళ్లి పరామర్శించిన పార్థసారథి
March 12, 2026 09:59 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ఆదోని,: పోలీసుల జరిమానాల భారంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్‌కు ఎమ్మెల్యే పార్థసారథి అండగా నిలిచారు. ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తిమ్మప్ప సోషల్ మీడియాలో తన బాధను వెల్లడించిన వీడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించారు.

రోజంతా కష్టపడితే రూ.400 నుంచి రూ.500 మాత్రమే సంపాదన వస్తోందని, అందులో ఎక్కువ భాగం పోలీసుల జరిమానాలకే వెళ్లిపోతోందని తిమ్మప్ప వాపోయాడు. తల్లి కూలి పనికి వెళ్లి సంపాదించే రూ.200తో కలిసి కుటుంబం అతికష్టం మీద గడుస్తోందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ జరిమానాలు విధిస్తే పేదలు ఎలా బతకాలని అధికారులను ప్రశ్నించాడు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పార్థసారథి తిమ్మప్ప ఇంటికి వెళ్లి అతని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ పక్కనే కూర్చుని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిబంధనల పేరుతో పేదలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. తిమ్మప్ప లాంటి కష్టజీవులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని సీఎం, డీసీఎం మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News