Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:35 AM

ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ — 44 ఏళ్ల ప్రస్థానం గర్వకారణం: మోరంపూడి శ్రీనివాసరావు

ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ — 44 ఏళ్ల ప్రస్థానం గర్వకారణం: మోరంపూడి శ్రీనివాసరావు

ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ — 44 ఏళ్ల ప్రస్థానం గర్వకారణం: మోరంపూడి శ్రీనివాసరావు
29-03-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, తెలుగోడి సత్తా, పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు.

ఒక ప్రాంతీయ పార్టీగా 44 సంవత్సరాలు నిరంతరంగా పటిష్టంగా కొనసాగడం చరిత్రలో అరుదైన ఘట్టమని ఆయన పేర్కొన్నారు. దీనికి పునాది వేసిన మహనీయుడు ఎన్టీ రామారావు అని, ఆ పునాదిపై బలమైన నిర్మాణాన్ని నిర్మించినది చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.

పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 10 అసెంబ్లీ ఎన్నికల్లో 6 సార్లు విజయం సాధించడం టీడీపీ ప్రజల్లో ఉన్న బలాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకుడు కట్టుబాటుతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం నాయకులు, కార్యకర్తల ఉత్సాహంతో జోష్‌గా సాగి, టీడీపీ శక్తిని మరోసారి చాటిచెప్పింది.

Sthanikam

ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ — 44 ఏళ్ల ప్రస్థానం గర్వకారణం: మోరంపూడి శ్రీనివాసరావు

Article Image

చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, తెలుగోడి సత్తా, పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు.

ఒక ప్రాంతీయ పార్టీగా 44 సంవత్సరాలు నిరంతరంగా పటిష్టంగా కొనసాగడం చరిత్రలో అరుదైన ఘట్టమని ఆయన పేర్కొన్నారు. దీనికి పునాది వేసిన మహనీయుడు ఎన్టీ రామారావు అని, ఆ పునాదిపై బలమైన నిర్మాణాన్ని నిర్మించినది చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.

పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 10 అసెంబ్లీ ఎన్నికల్లో 6 సార్లు విజయం సాధించడం టీడీపీ ప్రజల్లో ఉన్న బలాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకుడు కట్టుబాటుతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం నాయకులు, కార్యకర్తల ఉత్సాహంతో జోష్‌గా సాగి, టీడీపీ శక్తిని మరోసారి చాటిచెప్పింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News