Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బడుగు బలహీనుల కోసం పోరాడిన పాపన్నకు నివాళి బిడ్డను ఒడిలో, మందుల పెట్టె చేతిలో… నది దాటి టీకాలు ఇస్తున్న మంతి కుమారి “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 06:49 PM

ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలి. సమయానికి వైద్యం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలి. సమయానికి వైద్యం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలి.  సమయానికి వైద్యం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి
April 02, 2026 04:06 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

గురువారం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పరిశీలించిన ఆయన , ఎమర్జెన్సీ, మెడికల్, లేబర్ రూమ్, ఇన్‌పేషెంట్ వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన మందులను తొలగించాలని తెలిపారు. రోజువారీ ఓపీ, నెలవారీ డెలివరీలపై ఆరా తీశారు.

గర్భిణీల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, ఆశా వర్కర్ల ద్వారా అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు.

ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, చెత్త తొలగించి మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. మనోహర్, డిసిహెచ్ఎస్ డాక్టర్ చిన్న నాయక్, ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ శ్వేత ప్రియాంక,సివిల్ సర్జన్ డాక్టర్ వీరన్న, డాక్టర్ మాధవ్, డాక్టర్ అశ్విన్, గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటి రమేష్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News