ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలి. సమయానికి వైద్యం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి
ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలి. సమయానికి వైద్యం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి
Editor Desk
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.
గురువారం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పరిశీలించిన ఆయన , ఎమర్జెన్సీ, మెడికల్, లేబర్ రూమ్, ఇన్పేషెంట్ వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన మందులను తొలగించాలని తెలిపారు. రోజువారీ ఓపీ, నెలవారీ డెలివరీలపై ఆరా తీశారు.
గర్భిణీల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, ఆశా వర్కర్ల ద్వారా అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, చెత్త తొలగించి మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. మనోహర్, డిసిహెచ్ఎస్ డాక్టర్ చిన్న నాయక్, ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ శ్వేత ప్రియాంక,సివిల్ సర్జన్ డాక్టర్ వీరన్న, డాక్టర్ మాధవ్, డాక్టర్ అశ్విన్, గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటి రమేష్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి