Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:16 AM

ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలి. సమయానికి వైద్యం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలి. సమయానికి వైద్యం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలి.  సమయానికి వైద్యం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి
April 02, 2026 04:06 PM 106 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

గురువారం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పరిశీలించిన ఆయన , ఎమర్జెన్సీ, మెడికల్, లేబర్ రూమ్, ఇన్‌పేషెంట్ వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన మందులను తొలగించాలని తెలిపారు. రోజువారీ ఓపీ, నెలవారీ డెలివరీలపై ఆరా తీశారు.

గర్భిణీల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, ఆశా వర్కర్ల ద్వారా అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు.

ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, చెత్త తొలగించి మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. మనోహర్, డిసిహెచ్ఎస్ డాక్టర్ చిన్న నాయక్, ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ శ్వేత ప్రియాంక,సివిల్ సర్జన్ డాక్టర్ వీరన్న, డాక్టర్ మాధవ్, డాక్టర్ అశ్విన్, గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటి రమేష్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News