PRINT TIME: June 24, 2026 11:20 PM
అసంపూర్ణ గృహాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలి : హౌసింగ్ అధికారులు
అసంపూర్ణ గృహాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలి : హౌసింగ్ అధికారులు
March 06, 2026 05:05 PM
113 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ, సూరంపాలెం గ్రామాల్లో
2019 నుంచి 2024 వరకు నిర్మాణంలో ఉన్న గృహాలు ఇంకా పూర్తికాని వాటిని ఈ నెల ఆఖరులోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులు లబ్ధిదారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా గృహ నిర్మాణం పూర్తి చేయని పక్షంలో సంబంధిత ఇంటి బిల్లులు రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకొని త్వరితగతిన గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దివ్య, డి.ఇ.వో.అనిల్, వర్క్ ఇన్స్పెక్టర్ బుర్రి విజయ్ పాల్గొని లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి