Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:23 PM

అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన

అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన

అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన
19-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుర్రపుడెక్క ఆకులు తొలగించి కట్టకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్

రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామ పరిధిలోని అసిఫ్ నగర్ రాచకాలువ దుస్థితి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో గుర్రపుడెక్క ఆకులు, చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహం ఆగిపోగా, కట్ట కూడా శిథిలావస్థకు చేరింది. వెంటనే శుభ్రపరిచే పనులు చేపట్టి కట్టను బలోపేతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీపీఎం పోరుయాత్రలో భాగంగా కాలువను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా ముసి నీరు రావడంతో కాలువలో చెత్త, మొక్కలు పెరిగి నీరు సరిగా వెళ్లడం లేదన్నారు. దీంతో నీరు పొలాల్లోకి చేరి పంటలకు నష్టం జరుగుతోందని తెలిపారు.

కింది పొలాలు జాలుబడిపోవడంతో దున్నడం, కోతలు కోయడం కష్టంగా మారిందన్నారు. భారీ వర్షాల సమయంలో కాలువ కట్టపై నుంచి నీరు పొర్లి గ్రామానికి ప్రమాదంగా మారుతుందని, పలు సందర్భాల్లో కట్ట తెగి నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు.

కాలువలో పేరుకుపోయిన ఆకులు తొలగించడం, కట్టకు పెరిగిన కంపచెట్లను తొలగించడం, మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని కోరారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తలుపునూరి శ్రీనివాస్, తాళ్లపల్లి జితేందర్, గంటెపాక శ్రీను, బూడిద నర్మదనర్సింహా, తొలుపునూరి చంద్రశేఖర్, గంటెపాక శివకుమార్, మేడి ముకుంద, ఎండి మైనొద్దీన్, ఉండ్రాతి నరసింహ, బూడిద బిక్షం, గునుగుంట్ల సత్యనారాయణ, మేడి భాషయ్య, గంటెపాక చిన్న ముత్యాలు, గంటెపాక శ్రీకృష్ణ, కనుకుంట్ల ఉపేందర్, పోగుల ఉపేందర్, బొడ్డుపల్లి ఉపేందర్, జంపాల మహేష్, బోనగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన

Article Image

గుర్రపుడెక్క ఆకులు తొలగించి కట్టకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్

రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామ పరిధిలోని అసిఫ్ నగర్ రాచకాలువ దుస్థితి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో గుర్రపుడెక్క ఆకులు, చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహం ఆగిపోగా, కట్ట కూడా శిథిలావస్థకు చేరింది. వెంటనే శుభ్రపరిచే పనులు చేపట్టి కట్టను బలోపేతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీపీఎం పోరుయాత్రలో భాగంగా కాలువను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా ముసి నీరు రావడంతో కాలువలో చెత్త, మొక్కలు పెరిగి నీరు సరిగా వెళ్లడం లేదన్నారు. దీంతో నీరు పొలాల్లోకి చేరి పంటలకు నష్టం జరుగుతోందని తెలిపారు.

కింది పొలాలు జాలుబడిపోవడంతో దున్నడం, కోతలు కోయడం కష్టంగా మారిందన్నారు. భారీ వర్షాల సమయంలో కాలువ కట్టపై నుంచి నీరు పొర్లి గ్రామానికి ప్రమాదంగా మారుతుందని, పలు సందర్భాల్లో కట్ట తెగి నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు.

కాలువలో పేరుకుపోయిన ఆకులు తొలగించడం, కట్టకు పెరిగిన కంపచెట్లను తొలగించడం, మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని కోరారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తలుపునూరి శ్రీనివాస్, తాళ్లపల్లి జితేందర్, గంటెపాక శ్రీను, బూడిద నర్మదనర్సింహా, తొలుపునూరి చంద్రశేఖర్, గంటెపాక శివకుమార్, మేడి ముకుంద, ఎండి మైనొద్దీన్, ఉండ్రాతి నరసింహ, బూడిద బిక్షం, గునుగుంట్ల సత్యనారాయణ, మేడి భాషయ్య, గంటెపాక చిన్న ముత్యాలు, గంటెపాక శ్రీకృష్ణ, కనుకుంట్ల ఉపేందర్, పోగుల ఉపేందర్, బొడ్డుపల్లి ఉపేందర్, జంపాల మహేష్, బోనగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News