Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 02:22 AM

అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన

అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన

అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన
April 19, 2026 04:43 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుర్రపుడెక్క ఆకులు తొలగించి కట్టకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్

రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామ పరిధిలోని అసిఫ్ నగర్ రాచకాలువ దుస్థితి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో గుర్రపుడెక్క ఆకులు, చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహం ఆగిపోగా, కట్ట కూడా శిథిలావస్థకు చేరింది. వెంటనే శుభ్రపరిచే పనులు చేపట్టి కట్టను బలోపేతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీపీఎం పోరుయాత్రలో భాగంగా కాలువను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా ముసి నీరు రావడంతో కాలువలో చెత్త, మొక్కలు పెరిగి నీరు సరిగా వెళ్లడం లేదన్నారు. దీంతో నీరు పొలాల్లోకి చేరి పంటలకు నష్టం జరుగుతోందని తెలిపారు.

కింది పొలాలు జాలుబడిపోవడంతో దున్నడం, కోతలు కోయడం కష్టంగా మారిందన్నారు. భారీ వర్షాల సమయంలో కాలువ కట్టపై నుంచి నీరు పొర్లి గ్రామానికి ప్రమాదంగా మారుతుందని, పలు సందర్భాల్లో కట్ట తెగి నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు.

కాలువలో పేరుకుపోయిన ఆకులు తొలగించడం, కట్టకు పెరిగిన కంపచెట్లను తొలగించడం, మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని కోరారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తలుపునూరి శ్రీనివాస్, తాళ్లపల్లి జితేందర్, గంటెపాక శ్రీను, బూడిద నర్మదనర్సింహా, తొలుపునూరి చంద్రశేఖర్, గంటెపాక శివకుమార్, మేడి ముకుంద, ఎండి మైనొద్దీన్, ఉండ్రాతి నరసింహ, బూడిద బిక్షం, గునుగుంట్ల సత్యనారాయణ, మేడి భాషయ్య, గంటెపాక చిన్న ముత్యాలు, గంటెపాక శ్రీకృష్ణ, కనుకుంట్ల ఉపేందర్, పోగుల ఉపేందర్, బొడ్డుపల్లి ఉపేందర్, జంపాల మహేష్, బోనగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News