Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశాలు ఇవ్వాలి. సిపిఐ – ఈవోకు వినతి పత్రం ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 19, 2026 06:57 PM

అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన

అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన

అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన
April 19, 2026 04:43 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుర్రపుడెక్క ఆకులు తొలగించి కట్టకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్

రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామ పరిధిలోని అసిఫ్ నగర్ రాచకాలువ దుస్థితి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో గుర్రపుడెక్క ఆకులు, చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహం ఆగిపోగా, కట్ట కూడా శిథిలావస్థకు చేరింది. వెంటనే శుభ్రపరిచే పనులు చేపట్టి కట్టను బలోపేతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీపీఎం పోరుయాత్రలో భాగంగా కాలువను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా ముసి నీరు రావడంతో కాలువలో చెత్త, మొక్కలు పెరిగి నీరు సరిగా వెళ్లడం లేదన్నారు. దీంతో నీరు పొలాల్లోకి చేరి పంటలకు నష్టం జరుగుతోందని తెలిపారు.

కింది పొలాలు జాలుబడిపోవడంతో దున్నడం, కోతలు కోయడం కష్టంగా మారిందన్నారు. భారీ వర్షాల సమయంలో కాలువ కట్టపై నుంచి నీరు పొర్లి గ్రామానికి ప్రమాదంగా మారుతుందని, పలు సందర్భాల్లో కట్ట తెగి నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు.

కాలువలో పేరుకుపోయిన ఆకులు తొలగించడం, కట్టకు పెరిగిన కంపచెట్లను తొలగించడం, మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని కోరారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తలుపునూరి శ్రీనివాస్, తాళ్లపల్లి జితేందర్, గంటెపాక శ్రీను, బూడిద నర్మదనర్సింహా, తొలుపునూరి చంద్రశేఖర్, గంటెపాక శివకుమార్, మేడి ముకుంద, ఎండి మైనొద్దీన్, ఉండ్రాతి నరసింహ, బూడిద బిక్షం, గునుగుంట్ల సత్యనారాయణ, మేడి భాషయ్య, గంటెపాక చిన్న ముత్యాలు, గంటెపాక శ్రీకృష్ణ, కనుకుంట్ల ఉపేందర్, పోగుల ఉపేందర్, బొడ్డుపల్లి ఉపేందర్, జంపాల మహేష్, బోనగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News