అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన
అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన
Editor Desk
గుర్రపుడెక్క ఆకులు తొలగించి కట్టకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్
రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామ పరిధిలోని అసిఫ్ నగర్ రాచకాలువ దుస్థితి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో గుర్రపుడెక్క ఆకులు, చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహం ఆగిపోగా, కట్ట కూడా శిథిలావస్థకు చేరింది. వెంటనే శుభ్రపరిచే పనులు చేపట్టి కట్టను బలోపేతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఎం పోరుయాత్రలో భాగంగా కాలువను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా ముసి నీరు రావడంతో కాలువలో చెత్త, మొక్కలు పెరిగి నీరు సరిగా వెళ్లడం లేదన్నారు. దీంతో నీరు పొలాల్లోకి చేరి పంటలకు నష్టం జరుగుతోందని తెలిపారు.
కింది పొలాలు జాలుబడిపోవడంతో దున్నడం, కోతలు కోయడం కష్టంగా మారిందన్నారు. భారీ వర్షాల సమయంలో కాలువ కట్టపై నుంచి నీరు పొర్లి గ్రామానికి ప్రమాదంగా మారుతుందని, పలు సందర్భాల్లో కట్ట తెగి నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు.
కాలువలో పేరుకుపోయిన ఆకులు తొలగించడం, కట్టకు పెరిగిన కంపచెట్లను తొలగించడం, మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని కోరారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తలుపునూరి శ్రీనివాస్, తాళ్లపల్లి జితేందర్, గంటెపాక శ్రీను, బూడిద నర్మదనర్సింహా, తొలుపునూరి చంద్రశేఖర్, గంటెపాక శివకుమార్, మేడి ముకుంద, ఎండి మైనొద్దీన్, ఉండ్రాతి నరసింహ, బూడిద బిక్షం, గునుగుంట్ల సత్యనారాయణ, మేడి భాషయ్య, గంటెపాక చిన్న ముత్యాలు, గంటెపాక శ్రీకృష్ణ, కనుకుంట్ల ఉపేందర్, పోగుల ఉపేందర్, బొడ్డుపల్లి ఉపేందర్, జంపాల మహేష్, బోనగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి