Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 05:19 PM

ఆసరా పెన్షన్‌కు షరతులు వద్దు సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలి: రాపోలు నరసింహ

ఆసరా పెన్షన్‌కు షరతులు వద్దు సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలి: రాపోలు నరసింహ

ఆసరా పెన్షన్‌కు షరతులు వద్దు సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలి: రాపోలు నరసింహ
March 13, 2026 03:12 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేట: సీనియర్ సిటిజన్లకు ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని ఆల్ సీనియర్ సిటిజన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు నరసయ్య డిమాండ్ చేశారు. రామన్నపేట మండల సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు జెల్ల శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదని, భూములు ఉన్నాయని కారణాలు చూపుతూ కొంతమంది వృద్ధులకు పెన్షన్ నిరాకరిస్తున్నారని, దీంతో వారు నిరాదరణకు గురవుతున్నారని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలని కోరారు.

రామన్నపేట మండలంలో సీనియర్ సిటిజన్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ముందుగా మండల కమిటీని సంప్రదించాలని సూచించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర కమిటీ ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా, సిరిపురం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు అప్పం రామేశ్వరం, సీనియర్ సిటిజన్స్ మండల కార్యదర్శి కూనూరు సుదర్శన్, మండల ఉపాధ్యక్షుడు మిర్యాల భాస్కర్, నాయకులు మిర్యాల రామలింగం, రాపోలు లక్ష్మీనారాయణ, రాపోలు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News