Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:14 PM

ఆసరా పెన్షన్‌కు షరతులు వద్దు సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలి: రాపోలు నరసింహ

ఆసరా పెన్షన్‌కు షరతులు వద్దు సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలి: రాపోలు నరసింహ

ఆసరా పెన్షన్‌కు షరతులు వద్దు సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలి: రాపోలు నరసింహ
13-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: సీనియర్ సిటిజన్లకు ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని ఆల్ సీనియర్ సిటిజన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు నరసయ్య డిమాండ్ చేశారు. రామన్నపేట మండల సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు జెల్ల శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదని, భూములు ఉన్నాయని కారణాలు చూపుతూ కొంతమంది వృద్ధులకు పెన్షన్ నిరాకరిస్తున్నారని, దీంతో వారు నిరాదరణకు గురవుతున్నారని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలని కోరారు.

రామన్నపేట మండలంలో సీనియర్ సిటిజన్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ముందుగా మండల కమిటీని సంప్రదించాలని సూచించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర కమిటీ ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా, సిరిపురం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు అప్పం రామేశ్వరం, సీనియర్ సిటిజన్స్ మండల కార్యదర్శి కూనూరు సుదర్శన్, మండల ఉపాధ్యక్షుడు మిర్యాల భాస్కర్, నాయకులు మిర్యాల రామలింగం, రాపోలు లక్ష్మీనారాయణ, రాపోలు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆసరా పెన్షన్‌కు షరతులు వద్దు సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలి: రాపోలు నరసింహ

Article Image

రామన్నపేట: సీనియర్ సిటిజన్లకు ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని ఆల్ సీనియర్ సిటిజన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు నరసయ్య డిమాండ్ చేశారు. రామన్నపేట మండల సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు జెల్ల శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదని, భూములు ఉన్నాయని కారణాలు చూపుతూ కొంతమంది వృద్ధులకు పెన్షన్ నిరాకరిస్తున్నారని, దీంతో వారు నిరాదరణకు గురవుతున్నారని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలని కోరారు.

రామన్నపేట మండలంలో సీనియర్ సిటిజన్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ముందుగా మండల కమిటీని సంప్రదించాలని సూచించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర కమిటీ ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా, సిరిపురం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు అప్పం రామేశ్వరం, సీనియర్ సిటిజన్స్ మండల కార్యదర్శి కూనూరు సుదర్శన్, మండల ఉపాధ్యక్షుడు మిర్యాల భాస్కర్, నాయకులు మిర్యాల రామలింగం, రాపోలు లక్ష్మీనారాయణ, రాపోలు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News