PRINT TIME: April 17, 2026 09:59 PM
ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం
ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం
April 17, 2026 08:22 PM
6 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ తెలిపారు.
ఈ సందర్భంగా 18వ తేదీ శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం మూడు రోజుల పాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 20వ తేదీ సోమవారం నాడు స్వామివారి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి