ఆరెగూడెం గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా. పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
ఆరెగూడెం గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా. పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
Komidala Mahender reddy
చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి సహిత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆరెగూడెం గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవిందర్, చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, కందమళ్ళ శిశుపాల్ రెడ్డి, కంచర్ల వెంకట్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మి నరసింహ, ఆరెగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, నీలకంఠం లింగస్వామి, నాగంపల్లి కిశోర్, దశరథ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాములు, శేఖర్, దయాకర్, శేఖర్ బాబు, శ్రీను తదితరులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి