Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆర్ఎంపీ వేధింపులు… నర్సు ఆత్మహత్య ఆరెగూడెం గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా. పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 10:29 AM

ఆరెగూడెం గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా. పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.

ఆరెగూడెం గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా. పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.

ఆరెగూడెం గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా. పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
April 21, 2026 08:34 AM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి సహిత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెగూడెం గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవిందర్, చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, కందమళ్ళ శిశుపాల్ రెడ్డి, కంచర్ల వెంకట్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మి నరసింహ, ఆరెగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, నీలకంఠం లింగస్వామి, నాగంపల్లి కిశోర్, దశరథ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాములు, శేఖర్, దయాకర్, శేఖర్ బాబు, శ్రీను తదితరులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News