Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:51 PM

ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలి.. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు డిమాండ్

ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలి.. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు డిమాండ్

ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలి.. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు డిమాండ్
April 17, 2026 04:24 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సబ్‌స్టేషన్ ఆపరేటర్లను ఆర్టిజన్ వర్కర్లుగా మార్చి గ్రేడ్‌లుగా విభజించి వేతనాల్లో తేడాలు చూపుతున్నారని విమర్శించారు. ఒకే విధమైన పని చేస్తున్నప్పటికీ రెగ్యులర్ ఉద్యోగులకు లభిస్తున్న వేతనాలు, సౌకర్యాలు ఆర్టిజన్ కార్మికులకు అందడం లేదని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఈ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేసి న్యాయం చేయాలని కోరారు.

కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమస్యలపై పలు మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు. దీంతో ఈ నెల 8 నుంచి ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మికుల ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వల్దాస్ అంజయ్య, జేఏసీ నాయకులు ఇంజ మహేష్, బొట్ల రమేష్, ఎడ్ల వెంకటేష్, పాండరిరెడ్డి, సాగిన రమేష్, బొట్ల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News