Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:29 PM

ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలి.. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు డిమాండ్

ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలి.. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు డిమాండ్

ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలి.. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు డిమాండ్
17-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సబ్‌స్టేషన్ ఆపరేటర్లను ఆర్టిజన్ వర్కర్లుగా మార్చి గ్రేడ్‌లుగా విభజించి వేతనాల్లో తేడాలు చూపుతున్నారని విమర్శించారు. ఒకే విధమైన పని చేస్తున్నప్పటికీ రెగ్యులర్ ఉద్యోగులకు లభిస్తున్న వేతనాలు, సౌకర్యాలు ఆర్టిజన్ కార్మికులకు అందడం లేదని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఈ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేసి న్యాయం చేయాలని కోరారు.

కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమస్యలపై పలు మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు. దీంతో ఈ నెల 8 నుంచి ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మికుల ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వల్దాస్ అంజయ్య, జేఏసీ నాయకులు ఇంజ మహేష్, బొట్ల రమేష్, ఎడ్ల వెంకటేష్, పాండరిరెడ్డి, సాగిన రమేష్, బొట్ల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలి.. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు డిమాండ్

Article Image

భువనగిరి: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సబ్‌స్టేషన్ ఆపరేటర్లను ఆర్టిజన్ వర్కర్లుగా మార్చి గ్రేడ్‌లుగా విభజించి వేతనాల్లో తేడాలు చూపుతున్నారని విమర్శించారు. ఒకే విధమైన పని చేస్తున్నప్పటికీ రెగ్యులర్ ఉద్యోగులకు లభిస్తున్న వేతనాలు, సౌకర్యాలు ఆర్టిజన్ కార్మికులకు అందడం లేదని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఈ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేసి న్యాయం చేయాలని కోరారు.

కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమస్యలపై పలు మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు. దీంతో ఈ నెల 8 నుంచి ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మికుల ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వల్దాస్ అంజయ్య, జేఏసీ నాయకులు ఇంజ మహేష్, బొట్ల రమేష్, ఎడ్ల వెంకటేష్, పాండరిరెడ్డి, సాగిన రమేష్, బొట్ల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News