Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యమకారుల మహాసభకు భారీ ఏర్పాట్లు. జోగు అంజన్న ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 06:03 PM

ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలి.. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు డిమాండ్

ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలి.. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు డిమాండ్

ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలి.. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు డిమాండ్
April 17, 2026 04:24 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సబ్‌స్టేషన్ ఆపరేటర్లను ఆర్టిజన్ వర్కర్లుగా మార్చి గ్రేడ్‌లుగా విభజించి వేతనాల్లో తేడాలు చూపుతున్నారని విమర్శించారు. ఒకే విధమైన పని చేస్తున్నప్పటికీ రెగ్యులర్ ఉద్యోగులకు లభిస్తున్న వేతనాలు, సౌకర్యాలు ఆర్టిజన్ కార్మికులకు అందడం లేదని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఈ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేసి న్యాయం చేయాలని కోరారు.

కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమస్యలపై పలు మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు. దీంతో ఈ నెల 8 నుంచి ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మికుల ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వల్దాస్ అంజయ్య, జేఏసీ నాయకులు ఇంజ మహేష్, బొట్ల రమేష్, ఎడ్ల వెంకటేష్, పాండరిరెడ్డి, సాగిన రమేష్, బొట్ల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News