Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్సీ యాక్షన్ ప్లాన్‌కు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్. లోన్ల మంజూరుకు కాన్సెంట్ తప్పనిసరి.. గడువు పొడిగింపు బిడ్డను ఒడిలో, మందుల పెట్టె చేతిలో… నది దాటి టీకాలు ఇస్తున్న మంతి కుమారి “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 07:13 PM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు – కలెక్టర్ అనురాగ్ జయంతి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు – కలెక్టర్ అనురాగ్ జయంతి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు – కలెక్టర్ అనురాగ్ జయంతి
April 02, 2026 05:22 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

గురువారం భువనగిరి పరిధిలోని 31వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. జాతీయ గీతంతో సభను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చదివి వినిపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతు రుణ మాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్‌బుక్కులు, సన్న బియ్యం పంపిణీ, వైద్య సేవలు, డైట్ చార్జీల పెంపు వంటి పథకాల వివరాలను ప్రజలకు వివరించారు.

రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలను ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని సూచించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

వార్డుల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన విస్తరణ, విద్యార్థులకు మోటర్ వాహనాలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రియ వ్యవసాయం వంటి నూతన పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, 31వ వార్డు కౌన్సిలర్ సుమయ్య తబసుమ్, సంబంధిత అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News