Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:10 PM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు – కలెక్టర్ అనురాగ్ జయంతి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు – కలెక్టర్ అనురాగ్ జయంతి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు – కలెక్టర్ అనురాగ్ జయంతి
April 02, 2026 05:22 PM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

గురువారం భువనగిరి పరిధిలోని 31వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. జాతీయ గీతంతో సభను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చదివి వినిపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతు రుణ మాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్‌బుక్కులు, సన్న బియ్యం పంపిణీ, వైద్య సేవలు, డైట్ చార్జీల పెంపు వంటి పథకాల వివరాలను ప్రజలకు వివరించారు.

రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలను ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని సూచించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

వార్డుల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన విస్తరణ, విద్యార్థులకు మోటర్ వాహనాలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రియ వ్యవసాయం వంటి నూతన పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, 31వ వార్డు కౌన్సిలర్ సుమయ్య తబసుమ్, సంబంధిత అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News