Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:38 AM

అప్పుల ఊబిలో రాష్ట్రం అభివృద్ధి శూన్యం, స్వప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వం – చిన్న శ్రీను ధ్వజం.

అప్పుల ఊబిలో రాష్ట్రం అభివృద్ధి శూన్యం, స్వప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వం – చిన్న శ్రీను ధ్వజం.

అప్పుల ఊబిలో రాష్ట్రం అభివృద్ధి శూన్యం, స్వప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వం – చిన్న శ్రీను ధ్వజం.
24-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం,.

సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర క్యాంప్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. సాలూరు నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు.గత ప్రభుత్వ కాలంలో కొత్తవలసలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర కృషి చేసి సాధించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత గిరిజన శాఖ మంత్రివర్యులు ఇప్పటివరకు ఒక్కసారైనా ఆ యూనివర్సిటీని సందర్శించలేదని ప్రశ్నించారు.

పేరుకే గిరిజన శాఖ మంత్రి ఉన్నా, గిరిజనుల సంక్షేమం, అవసరాలు, అభివృద్ధి విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గంలో గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని విమర్శించారు. సుమారు రూ. 3.30 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాగ్ నివేదిక స్పష్టంగా వెల్లడిస్తోందని తెలిపారు.ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

అదేవిధంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా అధికారులు శాశ్వతమని, చట్టాలు, జీవోలు ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనై పనిచేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో విచారణ తప్పదని హెచ్చరించారు.

Sthanikam

అప్పుల ఊబిలో రాష్ట్రం అభివృద్ధి శూన్యం, స్వప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వం – చిన్న శ్రీను ధ్వజం.

Article Image

మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం,.

సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర క్యాంప్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. సాలూరు నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు.గత ప్రభుత్వ కాలంలో కొత్తవలసలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర కృషి చేసి సాధించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత గిరిజన శాఖ మంత్రివర్యులు ఇప్పటివరకు ఒక్కసారైనా ఆ యూనివర్సిటీని సందర్శించలేదని ప్రశ్నించారు.

పేరుకే గిరిజన శాఖ మంత్రి ఉన్నా, గిరిజనుల సంక్షేమం, అవసరాలు, అభివృద్ధి విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గంలో గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని విమర్శించారు. సుమారు రూ. 3.30 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాగ్ నివేదిక స్పష్టంగా వెల్లడిస్తోందని తెలిపారు.ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

అదేవిధంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా అధికారులు శాశ్వతమని, చట్టాలు, జీవోలు ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనై పనిచేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో విచారణ తప్పదని హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News