Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:30 PM

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య.. కుటుంబాన్ని ఆదుకోవాలి

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య.. కుటుంబాన్ని ఆదుకోవాలి

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య.. కుటుంబాన్ని ఆదుకోవాలి
11-03-2026 376 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: చేనేత వృత్తిలో పూటగడవక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మిర్యాల బాలరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు.

బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ నూలు, రంగుల ధరలు పెరగడంతో పాటు నేసిన బట్టలకు సరైన ధరలు లేకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోజంతా కష్టపడి పనిచేసినా పూటగడవక అప్పులబాధలు పెరిగి చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నూలు, రంగులపై మాత్రమే కాకుండా నేసిన బట్టలపై కూడా జీఎస్టీ విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా ప్రకటనలకే పరిమితమయ్యాయని అన్నారు. చేనేత రుణమాఫీ, నేతన్న భరోసా వంటి పథకాలు ప్రకటించి సంవత్సరంన్నర గడిచినా అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.

చనిపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా కూడా ఏళ్లుగా అందడంలేదని విమర్శించారు. మిర్యాల బాలరాజు కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవడంతో పాటు చేనేత కార్మికుల ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ముషం సత్యనారాయణ, ముషం శ్రీనివాసు, ఎలగందుల అంబాదాసు, కూరపాటి బిక్షపతి, ముషం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య.. కుటుంబాన్ని ఆదుకోవాలి

Article Image

రామన్నపేట,: చేనేత వృత్తిలో పూటగడవక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మిర్యాల బాలరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు.

బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ నూలు, రంగుల ధరలు పెరగడంతో పాటు నేసిన బట్టలకు సరైన ధరలు లేకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోజంతా కష్టపడి పనిచేసినా పూటగడవక అప్పులబాధలు పెరిగి చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నూలు, రంగులపై మాత్రమే కాకుండా నేసిన బట్టలపై కూడా జీఎస్టీ విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా ప్రకటనలకే పరిమితమయ్యాయని అన్నారు. చేనేత రుణమాఫీ, నేతన్న భరోసా వంటి పథకాలు ప్రకటించి సంవత్సరంన్నర గడిచినా అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.

చనిపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా కూడా ఏళ్లుగా అందడంలేదని విమర్శించారు. మిర్యాల బాలరాజు కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవడంతో పాటు చేనేత కార్మికుల ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ముషం సత్యనారాయణ, ముషం శ్రీనివాసు, ఎలగందుల అంబాదాసు, కూరపాటి బిక్షపతి, ముషం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News