Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:58 AM

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య.. కుటుంబాన్ని ఆదుకోవాలి

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య.. కుటుంబాన్ని ఆదుకోవాలి

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య.. కుటుంబాన్ని ఆదుకోవాలి
March 11, 2026 04:30 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: చేనేత వృత్తిలో పూటగడవక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మిర్యాల బాలరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు.

బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ నూలు, రంగుల ధరలు పెరగడంతో పాటు నేసిన బట్టలకు సరైన ధరలు లేకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోజంతా కష్టపడి పనిచేసినా పూటగడవక అప్పులబాధలు పెరిగి చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నూలు, రంగులపై మాత్రమే కాకుండా నేసిన బట్టలపై కూడా జీఎస్టీ విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా ప్రకటనలకే పరిమితమయ్యాయని అన్నారు. చేనేత రుణమాఫీ, నేతన్న భరోసా వంటి పథకాలు ప్రకటించి సంవత్సరంన్నర గడిచినా అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.

చనిపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా కూడా ఏళ్లుగా అందడంలేదని విమర్శించారు. మిర్యాల బాలరాజు కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవడంతో పాటు చేనేత కార్మికుల ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ముషం సత్యనారాయణ, ముషం శ్రీనివాసు, ఎలగందుల అంబాదాసు, కూరపాటి బిక్షపతి, ముషం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News