Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:20 PM

అప్పు అడిగినందుకే యువకుడి హత్య

అప్పు అడిగినందుకే యువకుడి హత్య

అప్పు అడిగినందుకే యువకుడి హత్య
06-03-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చిత్తూరు మండలం తుమ్మిందపాళ్యం గ్రామంలో అప్పు వివాదం ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొంది. స్నేహితుడికి ఇచ్చిన రూ.2 లక్షల అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు కాల్పులకు గురై యువకుడు మృతి చెందాడు.

గ్రామానికి చెందిన మునియప్ప కుమారుడు డిల్లీబాబు వ్యవసాయం చేస్తుండగా, మురుగేష్ కుమారుడు సాయికుమార్ (25) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరూ బంధువులు, స్నేహితులుగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం డిల్లీబాబు, సాయికుమార్ వద్ద నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో సాయికుమార్ పలుమార్లు డబ్బు కోరాడు. బుధవారం మరోసారి డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశానికి గురైన డిల్లీబాబు నాటు తుపాకీతో సాయికుమార్ ముఖంపై కాల్పులు జరిపాడు. దీంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న చిత్తూరు తాలూకా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వేట కోసం తమిళనాడులో తుపాకీ కొనుగోలు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

అప్పు అడిగినందుకే యువకుడి హత్య

Article Image

చిత్తూరు మండలం తుమ్మిందపాళ్యం గ్రామంలో అప్పు వివాదం ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొంది. స్నేహితుడికి ఇచ్చిన రూ.2 లక్షల అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు కాల్పులకు గురై యువకుడు మృతి చెందాడు.

గ్రామానికి చెందిన మునియప్ప కుమారుడు డిల్లీబాబు వ్యవసాయం చేస్తుండగా, మురుగేష్ కుమారుడు సాయికుమార్ (25) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరూ బంధువులు, స్నేహితులుగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం డిల్లీబాబు, సాయికుమార్ వద్ద నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో సాయికుమార్ పలుమార్లు డబ్బు కోరాడు. బుధవారం మరోసారి డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశానికి గురైన డిల్లీబాబు నాటు తుపాకీతో సాయికుమార్ ముఖంపై కాల్పులు జరిపాడు. దీంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న చిత్తూరు తాలూకా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వేట కోసం తమిళనాడులో తుపాకీ కొనుగోలు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News