Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 06, 2026 05:16 AM

అప్పు అడిగినందుకే యువకుడి హత్య

అప్పు అడిగినందుకే యువకుడి హత్య

అప్పు అడిగినందుకే యువకుడి హత్య
March 06, 2026 02:21 AM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చిత్తూరు మండలం తుమ్మిందపాళ్యం గ్రామంలో అప్పు వివాదం ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొంది. స్నేహితుడికి ఇచ్చిన రూ.2 లక్షల అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు కాల్పులకు గురై యువకుడు మృతి చెందాడు.

గ్రామానికి చెందిన మునియప్ప కుమారుడు డిల్లీబాబు వ్యవసాయం చేస్తుండగా, మురుగేష్ కుమారుడు సాయికుమార్ (25) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరూ బంధువులు, స్నేహితులుగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం డిల్లీబాబు, సాయికుమార్ వద్ద నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో సాయికుమార్ పలుమార్లు డబ్బు కోరాడు. బుధవారం మరోసారి డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశానికి గురైన డిల్లీబాబు నాటు తుపాకీతో సాయికుమార్ ముఖంపై కాల్పులు జరిపాడు. దీంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న చిత్తూరు తాలూకా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వేట కోసం తమిళనాడులో తుపాకీ కొనుగోలు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News