PRINT TIME: April 17, 2026 10:26 PM
ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.
ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.
April 17, 2026 08:39 PM
29 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కలెక్టరేట్ వద్ద దాహార్తి తీర్చే సేవలు ప్రారంభం
నల్లగొండ జిల్లా : వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్ సమీపంలో ఆపదమిత్ర వాలంటీర్ల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని డిఆర్డిఏ అధికారి శేఖర్ రెడ్డి ప్రారంభించారు.
వేసవి కాలంలో ప్రతిరోజూ కలెక్టర్ కార్యాలయానికి సమస్యల పరిష్కారం కోసం వందలాది మంది ప్రజలు వస్తుండటంతో వారికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలను ప్రారంభించినట్లు వాలంటీర్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ సిస్టమ్ ఆపరేటర్ విష్ణు, ఆపదమిత్ర వాలంటీర్లు గోనె కరుణాకర్, కందుల శివకుమార్, లక్ష్మణ్ నాయక్, స్వాతి, వెంకట్, సామ్యూల్, రవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి