Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 08, 2026 07:22 AM

ఆపదమిత్ర శిక్షణలో పాల్గొన్న విద్యార్థికి గవర్నర్ ప్రశంసాపత్రం

ఆపదమిత్ర శిక్షణలో పాల్గొన్న విద్యార్థికి గవర్నర్ ప్రశంసాపత్రం

ఆపదమిత్ర శిక్షణలో పాల్గొన్న విద్యార్థికి గవర్నర్ ప్రశంసాపత్రం
March 08, 2026 05:32 AM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేట: ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వారం రోజుల ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సురేష్ గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. సురేష్ బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

కళాశాల తరఫున అభినందనలు

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్ విద్యార్థి సురేష్‌తో పాటు వారికి నాయకత్వం వహించిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తాటిశెట్టి శ్రీనివాసులను అభినందించారు.

పదిమంది విద్యార్థుల పాల్గొనం

రామన్నపేట డిగ్రీ కళాశాల నుంచి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తాటిశెట్టి శ్రీనివాసుల నాయకత్వంలో మొత్తం పదిమంది విద్యార్థులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆపద సమయంలో స్పందనపై శిక్షణ

ఆపద సమయంలో ప్రజలను రక్షించే విధానం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని పాల్గొన్న విద్యార్థులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News