అనుమతులు లేకుండా పనులు చేస్తే సహించం:
అనుమతులు లేకుండా పనులు చేస్తే సహించం:
Editor Desk
అనుమతులు చూపాలి… లేకపోతే పోరాటం.
పర్యావరణ పరిరక్షణ వేదిక హెచ్చరిక
రామన్నపేటలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ పరిశ్రమ పనులు ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డదారిలో కొనసాగిస్తే తీవ్ర ప్రజా పోరాటం తప్పదని పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు హెచ్చరించారు.
అదాని లాజిస్టిక్స్ లిమిటెడ్ పేరుతో అంబుజా సిమెంట్ కాలుష్య పరిశ్రమ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ వేదిక, అఖిలపక్షాల ఆధ్వర్యంలో స్థానిక నాయకులు స్థలాన్ని పరిశీలించి పనులను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్ మాట్లాడుతూ… గతంలో ప్రజల తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన పరిశ్రమ నిర్వాహకులు మళ్లీ సాకులు చూపుతూ పనులు ప్రారంభించడం సరికాదని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో పనులు చేపడుతున్నారని, సంబంధిత అనుమతులను ప్రజలకు, మీడియా ముందు బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
స్థానిక గ్రామపంచాయతీకి సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అడ్డదారిలో పనులు కొనసాగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, మరోసారి భారీ స్థాయిలో ప్రతిఘటన చేపడతామని హెచ్చరించారు.
రైతులను మోసం చేసి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి కాలుష్య పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వ్యతిరేకించిన విషయంపై జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గోదాస్ పృథ్వీరాజ్, ఊట్కూరు నర్సింహా, ఎండీ జమీరుద్దీన్, మిర్జా ఫజల్ బేగ్, శానగొండ వెంకటేశ్వర్లు, కొమ్ము శేఖర్, మోట మహేష్, సుదర్శన్, కొమ్ము రామస్వామి, అంబాల అశోక్, గురిజాల మహేష్ రెడ్డి, జల్లెల మల్లేష్, సమ్మయ్య, శీను, వీరమళ్ల లింగస్వామి, ఆకిటి శేఖర్, కల్లూరి శివ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి