Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 07:51 PM

అనుమతులు లేకుండా పనులు చేస్తే సహించం:

అనుమతులు లేకుండా పనులు చేస్తే సహించం:

అనుమతులు లేకుండా పనులు చేస్తే సహించం:
April 01, 2026 04:52 PM 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనుమతులు చూపాలి… లేకపోతే పోరాటం.

పర్యావరణ పరిరక్షణ వేదిక హెచ్చరిక

రామన్నపేటలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ పరిశ్రమ పనులు ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డదారిలో కొనసాగిస్తే తీవ్ర ప్రజా పోరాటం తప్పదని పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు హెచ్చరించారు.

అదాని లాజిస్టిక్స్ లిమిటెడ్ పేరుతో అంబుజా సిమెంట్ కాలుష్య పరిశ్రమ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ వేదిక, అఖిలపక్షాల ఆధ్వర్యంలో స్థానిక నాయకులు స్థలాన్ని పరిశీలించి పనులను అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్ మాట్లాడుతూ… గతంలో ప్రజల తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన పరిశ్రమ నిర్వాహకులు మళ్లీ సాకులు చూపుతూ పనులు ప్రారంభించడం సరికాదని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో పనులు చేపడుతున్నారని, సంబంధిత అనుమతులను ప్రజలకు, మీడియా ముందు బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

స్థానిక గ్రామపంచాయతీకి సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అడ్డదారిలో పనులు కొనసాగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, మరోసారి భారీ స్థాయిలో ప్రతిఘటన చేపడతామని హెచ్చరించారు.

రైతులను మోసం చేసి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి కాలుష్య పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వ్యతిరేకించిన విషయంపై జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గోదాస్ పృథ్వీరాజ్, ఊట్కూరు నర్సింహా, ఎండీ జమీరుద్దీన్, మిర్జా ఫజల్ బేగ్, శానగొండ వెంకటేశ్వర్లు, కొమ్ము శేఖర్, మోట మహేష్, సుదర్శన్, కొమ్ము రామస్వామి, అంబాల అశోక్, గురిజాల మహేష్ రెడ్డి, జల్లెల మల్లేష్, సమ్మయ్య, శీను, వీరమళ్ల లింగస్వామి, ఆకిటి శేఖర్, కల్లూరి శివ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News