Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:11 AM

అనుమతులు లేకుండా పనులు చేస్తే సహించం:

అనుమతులు లేకుండా పనులు చేస్తే సహించం:

అనుమతులు లేకుండా పనులు చేస్తే సహించం:
April 01, 2026 04:52 PM 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనుమతులు చూపాలి… లేకపోతే పోరాటం.

పర్యావరణ పరిరక్షణ వేదిక హెచ్చరిక

రామన్నపేటలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ పరిశ్రమ పనులు ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డదారిలో కొనసాగిస్తే తీవ్ర ప్రజా పోరాటం తప్పదని పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు హెచ్చరించారు.

అదాని లాజిస్టిక్స్ లిమిటెడ్ పేరుతో అంబుజా సిమెంట్ కాలుష్య పరిశ్రమ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ వేదిక, అఖిలపక్షాల ఆధ్వర్యంలో స్థానిక నాయకులు స్థలాన్ని పరిశీలించి పనులను అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్ మాట్లాడుతూ… గతంలో ప్రజల తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన పరిశ్రమ నిర్వాహకులు మళ్లీ సాకులు చూపుతూ పనులు ప్రారంభించడం సరికాదని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో పనులు చేపడుతున్నారని, సంబంధిత అనుమతులను ప్రజలకు, మీడియా ముందు బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

స్థానిక గ్రామపంచాయతీకి సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అడ్డదారిలో పనులు కొనసాగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, మరోసారి భారీ స్థాయిలో ప్రతిఘటన చేపడతామని హెచ్చరించారు.

రైతులను మోసం చేసి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి కాలుష్య పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వ్యతిరేకించిన విషయంపై జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గోదాస్ పృథ్వీరాజ్, ఊట్కూరు నర్సింహా, ఎండీ జమీరుద్దీన్, మిర్జా ఫజల్ బేగ్, శానగొండ వెంకటేశ్వర్లు, కొమ్ము శేఖర్, మోట మహేష్, సుదర్శన్, కొమ్ము రామస్వామి, అంబాల అశోక్, గురిజాల మహేష్ రెడ్డి, జల్లెల మల్లేష్, సమ్మయ్య, శీను, వీరమళ్ల లింగస్వామి, ఆకిటి శేఖర్, కల్లూరి శివ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News