రామన్నపేట: ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న పల్లవి మోడల్ స్కూల్పై విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మెడబోయిన మమత డిమాండ్ చేశారు.
మమత మాట్లాడుతూ, సంబంధిత అనుమతులు లేకుండానే స్కూల్ నిర్వహకులు అడ్మిషన్ల కోసం మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పుట్టల ఉదయ్, ధరావత్ జగన్ నాయక్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి