Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:12 PM

అన్నెపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

అన్నెపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

అన్నెపర్తిలో ధాన్యం  కొనుగోలు కేంద్రం ప్రారంభం
April 12, 2026 03:17 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సర్పంచ్ పల్లవి ఆదేశం

నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ పల్లవి అరవింద్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. సీతారాంపురం ఐకేపీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్రముల శైలజతో పాటు వార్డు సభ్యులు మట్టపల్లి రూప, కునుకుంట్ల నర్సింహ, కంభంపాటి వెంకటమ్మ, తోట వెంకట్ రెడ్డి, చర్లపల్లి కృష్ణ, బొగరి రామలింగస్వామి, నూకల దశరథ, గంగుల నాగమ్మ మోసంగి అంతయ్య, మామిడి లింగస్వామి , మట్టపల్లి అనిల్, ఎదుల ఇంద్రారెడ్డి, దొండ శేఖర్, నూకల సైదులు, నర్రముల నరసింహ, బదుల శేఖర్ తదితరులు, గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పల్లవి అరవింద్ రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ కేంద్రంలో తేమ శాతం మరియు తాలు పేరుతో అధికారులు, హమాలీలు రైతులను ఇబ్బంది పెట్టరాదని స్పష్టం చేశారు. రైతుల ధాన్యాన్ని పారదర్శకంగా, వేగంగా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా గ్రామ రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News