అన్నెపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
అన్నెపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Komidala Mahender reddy
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సర్పంచ్ పల్లవి ఆదేశం
నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ పల్లవి అరవింద్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. సీతారాంపురం ఐకేపీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్రముల శైలజతో పాటు వార్డు సభ్యులు మట్టపల్లి రూప, కునుకుంట్ల నర్సింహ, కంభంపాటి వెంకటమ్మ, తోట వెంకట్ రెడ్డి, చర్లపల్లి కృష్ణ, బొగరి రామలింగస్వామి, నూకల దశరథ, గంగుల నాగమ్మ మోసంగి అంతయ్య, మామిడి లింగస్వామి , మట్టపల్లి అనిల్, ఎదుల ఇంద్రారెడ్డి, దొండ శేఖర్, నూకల సైదులు, నర్రముల నరసింహ, బదుల శేఖర్ తదితరులు, గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పల్లవి అరవింద్ రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ కేంద్రంలో తేమ శాతం మరియు తాలు పేరుతో అధికారులు, హమాలీలు రైతులను ఇబ్బంది పెట్టరాదని స్పష్టం చేశారు. రైతుల ధాన్యాన్ని పారదర్శకంగా, వేగంగా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా గ్రామ రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి