అన్నా క్యాంటీన్కు 1000 రోజులు – పెనుకొండలో వేడుకలు
అన్నా క్యాంటీన్కు 1000 రోజులు – పెనుకొండలో వేడుకలు
Prakash
పెనుకొండ, పెనుకొండలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి, ప్రజలకు భోజనం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, పేదలకు తక్కువ ధరలో భోజనం అందించాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడినట్టు తెలిపారు. గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంటీన్లు నడిచాయని, ప్రస్తుతం కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేక కేంద్రాల ద్వారా రూ.5కే భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.
అన్నా క్యాంటీన్ ప్రారంభ సమయంలో పలు అడ్డంకులు ఎదురైనప్పటికీ సేవా కార్యక్రమాన్ని కొనసాగించామని ఆమె తెలిపారు. పేదల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా పెనుకొండలో అధికారికంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా గోరంట్ల మండలంలో కూడా సొంత నిధులతో కొత్త క్యాంటీన్ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి