ఆన్లైన్లోనే ఇసుక సరఫరా.. అక్రమాలకు చెక్! జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు
ఆన్లైన్లోనే ఇసుక సరఫరా.. అక్రమాలకు చెక్! జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు
Editor Desk
నల్గొండ: జిల్లాలో ఇసుక సరఫరాను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి మైనింగ్ శాఖ అధికారులతో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలు, ప్రభుత్వ పనుల కోసం అవసరమైన ఇసుకను ఆన్లైన్ ద్వారానే పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యానువల్ విధానానికి స్వస్తి పలుకుతూ ‘మన ఇసుక వాహనం’ ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా చెక్ పడుతుందని చెప్పారు.
ఇసుక రీచ్ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎక్కడైనా అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
మండల తహసీల్దార్లు, గ్రామపంచాయతీ అధికారులు గ్రామ ప్రజలకు ఆన్లైన్ బుకింగ్ విధానం పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్డీవోలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి కృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి