Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:13 PM

ఆన్‌లైన్‌లోనే ఇసుక సరఫరా.. అక్రమాలకు చెక్! జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు

ఆన్‌లైన్‌లోనే ఇసుక సరఫరా.. అక్రమాలకు చెక్! జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు

ఆన్‌లైన్‌లోనే ఇసుక సరఫరా.. అక్రమాలకు చెక్! జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు
April 02, 2026 06:40 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: జిల్లాలో ఇసుక సరఫరాను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి మైనింగ్ శాఖ అధికారులతో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలు, ప్రభుత్వ పనుల కోసం అవసరమైన ఇసుకను ఆన్‌లైన్ ద్వారానే పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యానువల్ విధానానికి స్వస్తి పలుకుతూ ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా చెక్ పడుతుందని చెప్పారు.

ఇసుక రీచ్‌ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎక్కడైనా అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

మండల తహసీల్దార్లు, గ్రామపంచాయతీ అధికారులు గ్రామ ప్రజలకు ఆన్‌లైన్ బుకింగ్ విధానం పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డీవోలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ అధికారి సాయి కృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News