Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పట్టణాభివృద్ధికి వేగం… మౌలిక సదుపాయాలే తొలి ప్రాధాన్యం- చైర్మన్ పావని రమేష్ గౌడ్ బిడ్డను ఒడిలో, మందుల పెట్టె చేతిలో… నది దాటి టీకాలు ఇస్తున్న మంతి కుమారి “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 08:34 PM

ఆన్‌లైన్‌లోనే ఇసుక సరఫరా.. అక్రమాలకు చెక్! జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు

ఆన్‌లైన్‌లోనే ఇసుక సరఫరా.. అక్రమాలకు చెక్! జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు

ఆన్‌లైన్‌లోనే ఇసుక సరఫరా.. అక్రమాలకు చెక్! జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు
April 02, 2026 06:40 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: జిల్లాలో ఇసుక సరఫరాను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి మైనింగ్ శాఖ అధికారులతో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలు, ప్రభుత్వ పనుల కోసం అవసరమైన ఇసుకను ఆన్‌లైన్ ద్వారానే పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యానువల్ విధానానికి స్వస్తి పలుకుతూ ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా చెక్ పడుతుందని చెప్పారు.

ఇసుక రీచ్‌ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎక్కడైనా అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

మండల తహసీల్దార్లు, గ్రామపంచాయతీ అధికారులు గ్రామ ప్రజలకు ఆన్‌లైన్ బుకింగ్ విధానం పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డీవోలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ అధికారి సాయి కృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News