Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీవాణి విద్యాలయ వార్షికోత్సవం. ఘనంగా విద్యార్థుల ప్రతిభకు వేదికగా వేడుకలు AAP యువ ముఖానికి ‘రాజ్యసభ ఎగ్జిట్’… అంతర్గత వ్యూహాల్లో భారీ మార్పులా? “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 10:26 PM

అనాజిపురంలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం వైభవం భక్తులతో కిక్కిరిసిన ఆలయం

అనాజిపురంలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం వైభవం భక్తులతో కిక్కిరిసిన ఆలయం

అనాజిపురంలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం వైభవం భక్తులతో కిక్కిరిసిన ఆలయం
April 02, 2026 08:37 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి-భువనగిరి: భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం వైభవంగా నిర్వహించారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు భగవన్నామ స్మరణతో ఆలయాన్ని మారుమోగించారు.

మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కళ్యాణ తంతు ఘనంగా సాగింది. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ పంతులు, ధర్మకర్త సిరికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారు అమ్మవారికి మాంగల్యధారణ చేశారు. చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన క్షేత్రంలో స్వామివారు భక్తుల కోరికలను తీర్చే దైవంగా విశ్వాసం నెలకొందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత ధర్మకర్త సిరికొండ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, ఉపసర్పంచ్ వెలిశాల మురళి, గునుగుంట్ల శ్రీనివాస్, సిరికొండ అశోక్, నీలం భిక్షపతి, పిట్టల శ్రీశైలం, ఎదునూరి నరేష్, బొల్లేపల్లి మాణిక్యం, గోగు పోశాలు, గోద మల్లయ్య, ఎదునూరి వెంకటేశం, భాస్కర్ పంతులు, లింగయ్య తదితర ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News