అనాజిపురంలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం వైభవం భక్తులతో కిక్కిరిసిన ఆలయం
అనాజిపురంలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం వైభవం భక్తులతో కిక్కిరిసిన ఆలయం
Editor Desk
యాదాద్రి-భువనగిరి: భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం వైభవంగా నిర్వహించారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు భగవన్నామ స్మరణతో ఆలయాన్ని మారుమోగించారు.
మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కళ్యాణ తంతు ఘనంగా సాగింది. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ పంతులు, ధర్మకర్త సిరికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారు అమ్మవారికి మాంగల్యధారణ చేశారు. చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన క్షేత్రంలో స్వామివారు భక్తుల కోరికలను తీర్చే దైవంగా విశ్వాసం నెలకొందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత ధర్మకర్త సిరికొండ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, ఉపసర్పంచ్ వెలిశాల మురళి, గునుగుంట్ల శ్రీనివాస్, సిరికొండ అశోక్, నీలం భిక్షపతి, పిట్టల శ్రీశైలం, ఎదునూరి నరేష్, బొల్లేపల్లి మాణిక్యం, గోగు పోశాలు, గోద మల్లయ్య, ఎదునూరి వెంకటేశం, భాస్కర్ పంతులు, లింగయ్య తదితర ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి