Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:16 PM

అనాజిపురంలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం వైభవం భక్తులతో కిక్కిరిసిన ఆలయం

అనాజిపురంలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం వైభవం భక్తులతో కిక్కిరిసిన ఆలయం

అనాజిపురంలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం వైభవం భక్తులతో కిక్కిరిసిన ఆలయం
April 02, 2026 08:37 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి-భువనగిరి: భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం వైభవంగా నిర్వహించారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు భగవన్నామ స్మరణతో ఆలయాన్ని మారుమోగించారు.

మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కళ్యాణ తంతు ఘనంగా సాగింది. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ పంతులు, ధర్మకర్త సిరికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారు అమ్మవారికి మాంగల్యధారణ చేశారు. చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన క్షేత్రంలో స్వామివారు భక్తుల కోరికలను తీర్చే దైవంగా విశ్వాసం నెలకొందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత ధర్మకర్త సిరికొండ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, ఉపసర్పంచ్ వెలిశాల మురళి, గునుగుంట్ల శ్రీనివాస్, సిరికొండ అశోక్, నీలం భిక్షపతి, పిట్టల శ్రీశైలం, ఎదునూరి నరేష్, బొల్లేపల్లి మాణిక్యం, గోగు పోశాలు, గోద మల్లయ్య, ఎదునూరి వెంకటేశం, భాస్కర్ పంతులు, లింగయ్య తదితర ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News