Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 07:31 AM

అంతయ్యగూడెం వద్ద ఘోర ప్రమాదం కారు ఢీకొని వ్యక్తి మృతి..

అంతయ్యగూడెం వద్ద ఘోర ప్రమాదం కారు ఢీకొని వ్యక్తి మృతి..

అంతయ్యగూడెం వద్ద ఘోర ప్రమాదం కారు ఢీకొని వ్యక్తి మృతి..
April 04, 2026 02:16 PM 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

యూ-టర్న్ తీసుకుంటుండగా మృత్యువు కబలింత..


మాడుగులపల్లి : నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు ఒక వాహనదారుడిని బలితీసుకుంది. ఈ ఘటనతో నామ్ ఎక్స్‌ప్రెస్ వేపై భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాడుగులపల్లి టోల్‌గేట్ సమీపంలోని అంతయ్యగూడెం యూ-టర్న్ వద్ద శనివారం ఒక వాహనదారుడు తన వాహనాన్ని రోడ్డు దాటించేందుకు (యూ-టర్న్) ప్రయత్నిస్తున్నాడు.

అదే సమయంలో నామ్ ఎక్స్‌ప్రెస్ వేపై అతివేగంతో దూసుకొచ్చిన ఒక కారు సదరు వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని సిరిగిరి రాంరెడ్డిగా గుర్తించారు. మృతదేహం రోడ్డుపై పడి ఉండటం, వాహనం నుజ్జునుజ్జు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎక్స్‌ప్రెస్ వేపై ప్రధాన కూడలి వద్ద ప్రమాదం జరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మాడుగులపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News