Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను కలసిన బోగారం కాంగ్రెస్ నాయకులు ఎల్బీనగర్ వద్ద ఘోర ప్రమాదం: ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టిన టాటా ఏస్.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్! “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 04, 2026 04:02 PM

అంతయ్యగూడెం వద్ద ఘోర ప్రమాదం కారు ఢీకొని వ్యక్తి మృతి..

అంతయ్యగూడెం వద్ద ఘోర ప్రమాదం కారు ఢీకొని వ్యక్తి మృతి..

అంతయ్యగూడెం వద్ద ఘోర ప్రమాదం కారు ఢీకొని వ్యక్తి మృతి..
April 04, 2026 02:16 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

యూ-టర్న్ తీసుకుంటుండగా మృత్యువు కబలింత..


మాడుగులపల్లి : నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు ఒక వాహనదారుడిని బలితీసుకుంది. ఈ ఘటనతో నామ్ ఎక్స్‌ప్రెస్ వేపై భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాడుగులపల్లి టోల్‌గేట్ సమీపంలోని అంతయ్యగూడెం యూ-టర్న్ వద్ద శనివారం ఒక వాహనదారుడు తన వాహనాన్ని రోడ్డు దాటించేందుకు (యూ-టర్న్) ప్రయత్నిస్తున్నాడు.

అదే సమయంలో నామ్ ఎక్స్‌ప్రెస్ వేపై అతివేగంతో దూసుకొచ్చిన ఒక కారు సదరు వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని సిరిగిరి రాంరెడ్డిగా గుర్తించారు. మృతదేహం రోడ్డుపై పడి ఉండటం, వాహనం నుజ్జునుజ్జు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎక్స్‌ప్రెస్ వేపై ప్రధాన కూడలి వద్ద ప్రమాదం జరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మాడుగులపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News