నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
అమావాస్యను పురస్కరించుకుని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పుష్పాభిషేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు చేశారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. ఆలయ పూజారులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించగా, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా సాగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి