అమరావతి, విజయవాడ లో 100 విద్యుత్ బస్సులు
అమరావతి, విజయవాడ లో 100 విద్యుత్ బస్సులు
GADDAM JAGANMOHAN REDDY
విజయవాడ, అమరావతి రాజధాని ప్రాంత మార్గాల్లో 100 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యాధరపురం డిపోలో రూ.23 కోట్ల వ్యయంతో నిర్వహణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సివిల్ పనులకు రూ.12.5 కోట్లు, ఉపకేంద్రం మరియు ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.10.5 కోట్లు కేటాయించారు. 6,000 కెవిఎ సామర్థ్యంతో ఉపకేంద్రాన్ని నిర్మించి, 20 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు అందించగా, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం పీయం ఈ బస్ సేవా స్కీం కింద సమకూర్చుతోంది. మరో ఆరు నెలల్లో బస్సులు రోడ్లపైకి రానున్నట్లు సమాచారం.
మొత్తం 11 మార్గాలను గుర్తించి సేవలు ప్రారంభించనున్నారు. విద్యుత్ బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత పాత నగర బస్సులను దశలవారీగా తొలగించనున్నారు. ఈ బస్సులు ప్రారంభమైన తర్వాత రోజుకు సుమారు 7,000 లీటర్ల డీజిల్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించనున్నారు.
విద్యుత్ బస్సుల ద్వారా కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన వ్యయం గణనీయంగా తగ్గనుందని అధికారులు వెల్లడించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి