PRINT TIME: May 31, 2026 03:15 AM
అక్షిత మృతికి సర్పంచ్ విక్రమ్ నివాళి.
అక్షిత మృతికి సర్పంచ్ విక్రమ్ నివాళి.
May 30, 2026 10:33 AM
218 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్న పేట మండలంలోనిఇంద్రపాలనగరం గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన బోదాస్ అక్షిత మృతదేహానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, వడ్డెర సంఘం అధ్యక్షుడు బోదాస్ సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య, ఈర్లపల్లి మల్లయ్య, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, నక్క వెంకటేష్, పాలసంగం డైరెక్టర్ గర్ధాస్ వెంకటేష్, పగుడాల వెంకటేష్, మాజీ వార్డు సభ్యుడు ఈర్లపల్లి రమేష్, గర్ధాస్ సాయి, రూపని బాలు తదితరులు పాల్గొని అక్షితకు నివాళులర్పించారు.
అక్షిత మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె కుటుంబ సభ్యులకు గ్రామస్తులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి